ఓంశాంతి. భగవానువాచ - ఏ మనిషిని గానీ, దేవతను గానీ, భగవంతుడు అని పిలవడం జరగదని పిల్లలకు అర్థం చేయించడం జరిగింది. ఇక్కడ కూర్చున్నప్పుడు మేము సంగమ యుగములోని బ్రాహ్మణులమని మీ బుద్ధిలో ఉంటుంది. ఈ స్మృతి కూడా సదా ఎవరికీ ఉండదు. స్వయాన్ని సత్యమైన బ్రాహ్మణులమని కూడా భావించరు. బ్రాహ్మణ పిల్లలు దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. మేము సంగమయుగీ బ్రాహ్మణులము, శివబాబా ద్వారా పురుషోత్తములుగా అవుతున్నాము. ఈ స్మృతి కూడా అందరికీ ఉండదు. మేము పురుషోత్తమ సంగమయుగములోని బ్రాహ్మణులమని పదే-పదే మర్చిపోతూ ఉంటారు. ఇది బుద్ధిలో గుర్తున్నా, అహో సౌభాగ్యము! సదా నంబరువారీగా ఉంటారు కదా. అందరూ తమ తమ బుద్ధి అనుసారముగా పురుషార్థీలు. ఇప్పుడు మీరు సంగమయుగీలు. పురుషోత్తములుగా అయ్యేవారు. అత్యంత ప్రియమైన తండ్రిని స్మృతి చేసినప్పుడే మనము పురుషోత్తములుగా అవుతామని మీకు తెలుసు. స్మృతి ద్వారానే పాపాలు వినాశనమవుతాయి. ఒకవేళ ఎవరైనా పాపము చేసినట్లయితే దానికి వంద రెట్లు లెక్క పెరుగుతుంది. ఇంతకు ముందు పాపము చేస్తే 10 శాతము పెరిగేది. ఇప్పుడు 100 శాతము పెరుగుతుంది. ఎందుకంటే ఈశ్వరుని ఒడిలోకి వచ్చి తిరిగి పాపము చేస్తున్నారు కదా. పురుషోత్తముల నుండి దేవతలుగా చేసేందుకు తండ్రి మనలను చదివిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ఎవరికైతే ఈ స్మృతి స్థిరంగా ఉంటుందో వారు అలౌకిక సేవను కూడా చాలా చేస్తూ ఉంటారు. సదా హర్షితముగా ఉండేందుకు ఇతరులకు కూడా దారిని తెలియపరచాలి. భలే ఎక్కడకు వెళ్ళినా బుద్ధిలో మేము సంగమయుగములో ఉన్నామని గుర్తుండాలి. ఇది పురుషోత్తమ సంగమయుగము. వారు పురుషోత్తమ మాసము లేక పురుషోత్తమ సంవత్సరమని అంటారు. మేము పురుషోత్తమ సంగమయుగీ బ్రాహ్మణులమని మీరంటారు. ఇప్పుడు మేము పురుషోత్తములుగా అయ్యే యాత్రలో ఉన్నామని, చాలా మంచిరీతిగా బుద్ధిలో ధారణ చేయాలి. ఇది గుర్తుంటే అది కూడా "మన్మనాభవ" అవుతుంది. మీరు పురుషార్థం అనుసారముగా మరియు కర్మల అనుసారముగా పురుషోత్తములుగా అవుతున్నారు. దైవీ గుణాలు కూడా కావాలి మరియు శ్రీమతముపై కూడా నడుస్తూ ఉండాలి. మనుష్యులందరూ తమ మతముపై నడుస్తుంటారు. అది రావణుని మతము. అలాగని మీరందరూ శ్రీమతముపై నడుస్తున్నారని కాదు. చాలామంది రావణుని మతముపై కూడా నడుస్తుంటారు. శ్రీమతమపై కొందరు కొంత శాతము, కొందరు కొంత శాతం నడుస్తారు. కొంతమంది రెండు శాతము మాత్రమే నడుస్తారు. భలే ఇక్కడ కూర్చుని ఉన్నా కాని శివబాబా స్మృతిలో ఉండలేరు. బుద్ధి యోగము ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. నేను ఏ పాపము చేయడంలేదు కదా? ఎవ్వరికీ దుఃఖమును ఇవ్వడం లేదు కదా? అని ప్రతి రోజు స్వయాన్ని చూసుకుంటూ ఉండాలి. స్వయాన్ని చాలా సంభాళించుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ధర్మరాజు కూడా నిలబడి ఉన్నారు కదా. ఇప్పుడిది లెక్కాచారమంతా సమాప్తం చేసుకునే సమయము. శిక్షలు కూడా అనుభవించవలసి వస్తుంది. మేము జన్మ-జన్మాంతరాల పాపులమని పిల్లలైన మీకు తెలుసు. ఎక్కడైనా ఏ మందిరములోకి వెళ్ళినా, ఏ గురువు వద్దకు వెళ్ళినా, ఏ ఇష్టదేవత వద్దకు వెళ్ళినా, మేము జన్మ జన్మల పాపులమని, మమ్ములను రక్షించమని, దయ చూపించమని అడుగుతారు, ప్రార్థిస్తారు. సత్యయుగములో ఎప్పుడూ కూడా ఇటువంటి మాటలు నోటి నుండి వెలువడవు. కొంతమంది సత్యము మాట్లాడతారు, కొంతమంది అసత్యము చెప్తారు. ఇక్కడ కూడా అలాగే ఉన్నారు. మీ జీవితగాథను వ్రాసి పంపమని బాబా ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. కొంతమంది పూర్తి సత్యమును వ్రాస్తారు. కొంతమంది దాచిపెడ్తారు కూడా. సిగ్గుగా అనిపిస్తుంది. చెడు కర్మలు చేయడంతో దాని ఫలితము కూడా చెడుగానే ఉంటుందని తెలుసు. అది అల్పకాలిక విషయము. ఇది చాలాకాలానికి చెందిన విషయం. చెడు కర్మలు చేసినట్లయితే శిక్షలు కూడా తింటారు మరియు స్వర్గములోకి కూడా చాలా చివర్లో వస్తారు. ఎవరెవరు పురుషోత్తములుగా అవుతారో ఇప్పుడు స్పష్టంగా తెలిసిపోతుంది. అది పురుషోత్తమ దైవీ రాజ్యము. ఉత్తమోత్తమ పురుషులుగా అవుతున్నారు కదా. మరెక్కడా ఈ విధంగా ఎవ్వరి యొక్క మహిమను చేయడం జరగదు. మనుష్యులకు దేవతల గుణాలేమిటో కూడా తెలియదు. భలే మహిమ చేస్తారు. కానీ చిలుకపలుకుల వలె అర్థము తెలియకుండా చేస్తారు. కనుక భక్తులకు కూడా అర్థం చేయించమని బాబా చెప్తారు. భక్తులు స్వయాన్ని నీచులమని, పాపులమని చెప్పుకుంటారు. అప్పుడు వారిని - మీరు శాంతిధామములో ఉన్నప్పుడు అక్కడ పాపము చేసేవారా? అని అడగండి. అక్కడ ఆత్మలన్నీ పవిత్రంగా ఉంటాయి. ఇక్కడ అపవిత్రంగా అయ్యాయి ఎందుకంటే తమోప్రధాన ప్రపంచము. నూతన ప్రపంచములో అయితే పవిత్రంగా ఉంటారు. అపవిత్రంగా చేసేది రావణుడు.
ఈ సమయంలో ముఖ్యంగా భారతదేశముపై, కాగా మిగతా ప్రపంచమంతటిపై రావణ రాజ్యముంది. యథా రాజా రాణి తథా ప్రజా. హైయ్యెస్ట్ (అత్యంత ఉన్నతము), లోయెస్ట్ (అత్యంత నీచము). ఇక్కడ అందరూ పతితులే. బాబా అంటారు - నేను మిమ్ములను పావనంగా చేసి వెళ్తాను, తర్వాత మిమ్ములను పతితంగా ఎవరు చేస్తారు? రావణుడు. ఇప్పుడు మీరు నా మతమును అనుసరించి మళ్ళీ పావనంగా అవుతున్నారు. అర్థకల్పము తర్వాత మళ్ళీ రావణ మతముపై పతితులుగా అవుతారు అంటే దేహాభిమానంలోకి వచ్చి వికారాలకు వశమైపోతారు. దానిని ఆసురీ మతమని అంటారు. భారతదేశము పావనంగా ఉండేది, అదే ఇప్పుడు పతితంగా అయిపోయింది. తిరిగి పావనంగా అవ్వాలి. పావనంగా చేసేందుకు పతితపావనుడైన తండ్రి రావలసి ఉంటుంది. ఇప్పుడు ఎంతమంది మనుష్యులున్నారో చూడండి! రేపటి నాడు ఎంతమంది మనుష్యులుంటారు! యుద్ధము జరుగుతుంది, మృత్యువు అయితే ఎదురుగా నిలబడి ఉంది. రేపు ఇంతమంది ఎక్కడికి వెళ్ళిపోతారు? అందరి శరీరాలు, ఈ పాత ప్రపంచము వినాశనమైపోతుంది. ఈ రహస్యము ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. అయితే నంబరువారు పురుషార్థానుసారంగా ఉంది. ఇప్పుడు మనము ఎవరి ముందు కూర్చొని ఉన్నామో కూడా చాలా మంది అర్థము చేసుకోరు. వారు అత్యంత తక్కువ పదవిని పొందుతారు. డ్రామానుసారముగా ఇంకేమి చేయగలరు, వారి భాగ్యములో లేదు. ఇప్పుడు పిల్లలైన మీరు సర్వీసు చేయాలి, తండ్రిని స్మృతి చేయాలి. మీరు సంగమయుగములోని బ్రాహ్మణులు, మీరు తండ్రి సమానంగా జ్ఞాన సాగరులుగా, సుఖ సాగరులుగా అవ్వాలి. తయారుచేసే తండ్రి లభించారు కదా. దేవతలను సర్వగుణ సంపన్నులు... అని మహిమ చేస్తారు. ఇప్పుడు ఈ గుణాలు కలవారు ఎవ్వరూ లేరు. మేము ఉన్నతపదవి పొందేందుకు ఎంతవరకు అర్హులుగా అయ్యాము అని స్వయాన్ని సదా ప్రశ్నించుకుంటూ ఉండండి. సంగమయుగాన్ని బాగా స్మృతి చేయండి. సంగమయుగ బ్రాహ్మణులైన మేము పురుషోత్తములుగా అయ్యేవారము. శ్రీకృష్ణుడు నూతన ప్రపంచములోని పురుషోత్తముడు కదా. మనము బాబా ముందు కూర్చొని ఉన్నామని పిల్లలకు తెలుసు. కనుక ఇంకా ఎక్కువగా చదువుకోవాలి. ఇతరులను చదివించాలి కూడా. చదివించలేదంటే, చదవలేదని ఋజువు అవుతుంది. బుద్ధిలో కూర్చోదు. 5 శాతము కూడా కూర్చోదు. మనము సంగమయుగములోని బ్రాహ్మణులమని కూడా గుర్తుండదు. బుద్ధిలో తండ్రీ గుర్తుండాలి మరియు చక్రమూ తిరుగుతూ ఉండాలి. అర్థం చేయించడం చాలా సహజం. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. వారు అందరికంటే గొప్ప తండ్రి. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని తండ్రి చెప్తున్నారు. మనమే పూజ్యులము, మనమే పూజారులము - ఇది చాలా మంచి మంత్రము. అయితే వారు 'ఆత్మనే పరమాత్మ' అని అనేశారు. వారు చెప్పేదంతా పూర్తిగా తప్పు. మనము పవిత్రంగా ఉండేవారము. 84 జన్మల చక్రములో తిరిగి ఇప్పుడిలా అయ్యాము. ఇప్పుడు మనము తిరిగి ఇంటికి వెళ్తాము. ఈ రోజు ఇక్కడున్నాము. రేపు ఇంటికి వెళ్తాము. మనము అనంతమైన తండ్రి ఇంటికి వెళ్తాము. ఇది అనంతమైన నాటకము. ఈ నాటకము రిపీట్ అవుతుంది. తండ్రి చెప్తున్నారు - దేహ సహితముగా, దేహపు సర్వధర్మాలను మరచి స్వయాన్ని ఆత్మగా భావించండి. ఇప్పుడు మనము ఈ శరీరాలను వదిలి ఇంటికి వెళ్ళిపోతాము. ఈ విషయాన్ని బుద్ధిలో పక్కాగా గుర్తుంచుకోండి. మనమంతా ఆత్మలము అన్న మాట మరియు మన ఇల్లు గుర్తుంటే, బుద్ధి నుండి ఈ ప్రపంచమంతా సన్యసింపబడినట్లే. శరీరాన్ని కూడా సన్యసిస్తారు కనుక సర్వస్వమూ సన్యసించినట్లే. ఆ హఠయోగులెవ్వరూ, ఈ సృష్టినంతటినీ సన్యసించరు. వారిది అసంపూర్ణమైన సన్యాసము. మీరు ఈ మొత్తం ప్రపంచాన్ని త్యాగము చేయాల్సి వస్తుంది. స్వయాన్ని దేహంగా భావిస్తే, పనులు కూడా అలాంటివే చేస్తారు. దేహాభిమానులుగా అవ్వడం వలన దొంగతనము, అసత్యము చెప్పడం, పాపము చేయడం,... వీటన్నిటికీ అలవాటు పడిపోతారు. గట్టిగా మాట్లాడడం కూడా అలవాటైపోతుంది. అలా మాట్లాడుతూ నా గొంతే అంత అని అంటారు. పగటిపూట 25 - 30 పాపాలు కూడా చేస్తారు. అసత్యము చెప్పడం కూడా పాపమే కదా, అలవాటైపోతుంది. బాబా చెప్తున్నారు - మెల్లగా మాట్లాడడం నేర్చుకోండి. శబ్దము తగ్గించుకునేందుకు సమయమేమీ పట్టదు. కుక్కలను కూడా పెంచుకుంటే అవి మంచిగా అవుతాయి. కోతులకు ఎంత కోపముంటుంది! అయినా అలవాటు చేయిస్తే డాన్సు మొదలైనవి కూడా చేస్తాయి. జంతువులు కూడా మారిపోతాయి. జంతువులను పరివర్తన చేసేది మనుష్యులు. మనుష్యులను పరివర్తన చేసేది తండ్రి. తండ్రి చెప్తున్నారు - మీరు కూడా జంతువుల వలె ఉన్నారు కనుక నన్ను కూడా కూర్మావతారముగా, వరాహావతారముగా అవతరించానని అంటారు. మీ కంటే నన్ను నీచంగా చేసేశారు. ఈ విషయాలు కూడా మీకు మాత్రమే తెలుసు. ప్రపంచములోని వారికి తెలియదు. చివరిలో మీకు సాక్షాత్కారమవుతుంది. ఎటువంటి శిక్షలను అనుభవిస్తారో అది కూడా మీకు తెలిసిపోతుంది. అర్ధకల్పము భక్తి చేశారు, ఇప్పుడు తండ్రి లభించారు. తండ్రి చెప్తున్నారు - నా మతమును అనుసరించకపోతే శిక్షలు ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు పాపాలు మొదలైనవి చేయడం మానండి. చార్టు వ్రాయండి. దానితో పాటు ధారణ కూడా చేయాలి. ఎవరికైనా అర్థం చేయించే అభ్యాసము కూడా ఉండాలి. ప్రదర్శనీ చిత్రాలపై ఆలోచిస్తూ ఉండండి. ఎవరికి ఎలా అర్థం చేయించాలో ఆలోచించండి. మొట్టమొదట గీతా భగవానుడు ఎవరు? అనే మాటతో ప్రారంభించండి. పతితపావనుడైన పరమపిత పరమాత్మయే జ్ఞానసాగరుడు కదా. ఈ తండ్రియే సర్వాత్మలకు తండ్రి కనుక ఆ తండ్రి పరిచయము కావాలి కదా. ఋషులు-మునులు మొదలైన వారెవ్వరికీ తండ్రి పరిచయమూ లేదు, వారి రచనల ఆది-మధ్యాంతాల గురించి కూడా తెలియదు. కనుక మొట్టమొదట భగవంతుడు ఎవరో అర్థము చేయించి వారిచేత భగవంతుడు ఒక్కరే అని వ్రాయించండి. ఇతరులెవ్వరూ భగవంతుడయ్యేందుకు వీలు లేదు. మనుష్యులు స్వయాన్ని భగవంతుడని పిలుచుకోలేరు.
భగవంతుడు నిరాకారుడని పిల్లలైన మీకిప్పుడు నిశ్చయముంది. తండ్రి మనల్ని చదివిస్తున్నారు, మనము విద్యార్థులము. వారు తండ్రే కాక మనకు టీచరు, సద్గురువు కూడా. ఒక్క తండ్రిని స్మృతి చేస్తే టీచరు, గురువు ఇరువురూ కూడా గుర్తుకు వస్తారు. బుద్ధి అటు-ఇటు భ్రమించకూడదు. కేవలం శివుడు అని కూడా అనకూడదు. శివుడు మన తండ్రే కాక సుప్రీమ్ టీచరు కూడా అయ్యారు. మనల్ని వారితోపాటు తీసుకెళ్తారు. మహిమ అంతా వారొక్కరిదే. వారినే స్మృతి చేయాలి. ఇతను వెళ్లి బి.కెలను గురువులుగా చేసుకున్నారని కొంతమంది అంటారు. మీరు గురువులుగా అయితే అవుతారు కదా. అయితే మిమ్ములను తండ్రి అని అనరు. టీచరు, గురువు అని అంటారు కానీ తండ్రి అని అనరు. ఆ తండ్రిని ఒక్కరినే మూడు సంబంధాలతో పిలుస్తారు. వారు అందరికంటే గొప్ప తండ్రి. వీరి(త్రిమూర్తుల) పైన కూడా ఆ తండ్రే ఉన్నారు. ఇది మంచిరీతిగా అర్థము చేయించాలి. ప్రదర్శనీలో అర్థం చేయించే వివేకము ఉండాలి. కానీ తమలో అంత ధైర్యముందని భావించరు. పెద్ద-పెద్ద ప్రదర్శనీలు జరిగితే ఎవరైతే మంచి-మంచి సేవాధారులైన పిల్లలుంటారో వారు వెళ్ళి సర్వీసు చేయాలి. బాబా వెళ్ళవద్దు అని చెప్పరు. ముందు-ముందు సాధు-సత్పురుషులు మొదలైనవారికి కూడా మీరు జ్ఞాన బాణములు వేస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్తారు? ఉండేది ఇది ఒక్క దుకాణమే. ఈ దుకాణము ద్వారా అందరికీ సద్గతి జరుగుతుంది. ఈ దుకాణము ఎటువంటిదంటే మీరు దీని ద్వారా అందరికీ పవిత్రంగా అయ్యేటటువంటి దారి తెలియజేస్తారు. వారు పవిత్రమవుతారా, అవ్వరా అన్నది వారి ఇష్టము.
పిల్లలైన మీ అటెన్షన్ విశేషంగా సేవపై ఉండాలి. భలే పిల్లలు వివేకవంతులుగా ఉన్నారు. కానీ సేవ పూర్తిగా చేయకపోతే, వీరిపై రాహు దశ కూర్చుందని తండ్రి భావిస్తారు. అందరి దశలు తిరుగుతూ ఉంటాయి కదా. మాయ యొక్క నీడ పడ్తుంది. మళ్ళీ రెండు రోజుల తర్వాత బాగైపోతారు. పిల్లలు సేవ చేసే అనుభవము పొంది రావాలి. ప్రదర్శనీలైతే చేస్తూనే ఉంటారు. గీతను గానము చేసింది శివ భగవానుడని, కృష్ణుడు కాదని మనుష్యులు ఎందుకు వెంటనే వ్రాయరు? కొంతమంది ఇది చాలా బాగుందని, మనుష్యులకు చాలా కళ్యాణకరమని, అందరికీ ఈ ప్రదర్శనీని చూపించాలని అంటారు. కానీ నేను కూడా వచ్చి ఈ వారసత్వము తీసుకుంటాను.... అని ఎవ్వరూ చెప్పరు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. దేహాభిమానానికి వశమై గట్టిగా మాట్లాడకూడదు. ఈ అలవాటును తొలగించివేయాలి. దొంగతనము చేయడం, అసత్యము చెప్పడం,... ఇవన్నీ పాపాలు. వీటి నుండి రక్షించుకునేందుకు దేహీ-అభిమానులుగా అయి ఉండాలి.
2. మృత్యువు మీ ఎదురుగా ఉంది. అందువలన తండ్రి శ్రీమతముపై నడుస్తూ పావనంగా అవ్వాలి. తండ్రికి చెందినవారిగా అయిన తర్వాత ఎలాంటి చెడు కర్మలు చేయకూడదు. శిక్షల నుండి రక్షించుకునే పురుషార్థము చేయాలి.