24-04-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం


"మధురమైనపిల్లలూ - ఈ సంగమయుగము సర్వోత్తమమైన యుగము, ఇందులోనే ఆత్మలైన మీరు తండ్రి అయిన పరమాత్మను కలుస్తారు, ఇదే సత్యాతి-సత్యమైన కుంభము”

ప్రశ్న:-

ఏ పాఠమును తండ్రి ఒక్కరే చదివిస్తారు, ఇతర ఏ మనుష్యులూ చదివించలేరు?

జవాబు:-

దేహీ-అభిమానులుగా అయ్యే పాఠమును తండ్రి ఒక్కరు మాత్రమే చదివించగలరు, ఏ దేహధారి ఈ పాఠమును చదివించలేరు. మొట్టమొదట మీకు ఆత్మ యొక్క జ్ఞానము లభిస్తుంది. ఆత్మలమైన మనము పరంధామము నుండి పాత్రధారులుగా అయి పాత్రను అభినయించేందుకు వచ్చాము, ఇప్పుడు నాటకము పూర్తవుతుంది, ఇది తయారై తయారవుతున్న డ్రామా, ఈ డ్రామాను ఎవ్వరూ తయారుచేయలేదు, అందుకే దీనికి ఆది మరియు అంతిమము కూడా లేవని పిల్లలైన మీకు తెలుసు.

గీతము:-

మేలుకోండి ప్రేయసులారా మేలుకోండి... (జాగ్ సజనియా జాగ్...)

ఓంశాంతి. ఈ పాటనైతే పిల్లలు చాలా సార్లు విని ఉంటారు. ప్రియుడు తన ప్రేయసులకు చెప్తున్నారు. శరీరములోకి వచ్చినప్పుడు వారిని ప్రియుడని అంటారు. శరీరము లేనప్పుడు వారు తండ్రి, మీరంతా వారి పిల్లలు. మీరందరూ భక్తులు. భగవంతుడిని స్మృతి చేస్తారు. బ్రైడ్స్ (వధువులు), బ్రైడ్ గ్రూమ్ (వరుడు) ని స్మృతి చేస్తారు. ఈ వరుడు అందరికీ ప్రియుడు. వారు కూర్చొని పిల్లలందరికి - కొత్త యుగం వస్తోంది, ఇక మేలుకోండి అని అర్థం చేయిస్తున్నారు. కొత్తది అనగా కొత్త ప్రపంచము, సత్యయుగము. కలియుగము పాత ప్రపంచము. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు, మిమ్మల్ని స్వర్గవాసులుగా చేస్తారు. నేను మిమ్మల్ని స్వర్గవాసులుగా చేస్తానని ఏ మనిషీ చెప్పలేరు. సన్యాసులకు స్వర్గము-నరకము అంటే ఏమిటో అస్సలు తెలియదు. ఎలాగైతే ఇతర ధర్మాలున్నాయో, అలాగే సన్యాస ధర్మము కూడా వేరే ఒక ధర్మము. అది ఆది సనాతన దేవీదేవతా ధర్మము కాదు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని భగవంతుడే వచ్చి స్థాపన చేస్తారు, ఎవరైతే నరకవాసులుగా ఉన్నారో వారే మళ్ళీ సత్యయుగములో స్వర్గవాసులుగా అవుతారు. ఇప్పుడు మీరు నరకవాసులు కాదు. మీరిప్పుడు సంగమయుగములో ఉన్నారు. సంగమం మధ్యలో ఉంటుంది. సంగమంలో మీరు స్వర్గవాసులుగా అయ్యే పురుషార్థమును చేస్తారు, అందుకే సంగమయుగానికి చాలా మహిమ ఉంది. వాస్తవానికి సర్వోత్తమమైన కుంభమేళా ఇదే. వీరినే పురుషోత్తములని అంటారు. మనమంతా ఒకే తండ్రి పిల్లలమని మీకు తెలుసు, బ్రదర్హుడ్ (సోదరత్వము) అని అంటారు కదా. ఆత్మలంతా పరస్పరములో సోదరులు. హిందువులు-చైనీయులు భాయి-భాయి అని అంటారు, అన్ని ధర్మాలవారిపరంగా, అందరూ సోదరులే - ఈ జ్ఞానము మీకిప్పుడే లభించింది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలైన మీరందరూ తండ్రినైన నా సంతానము. ఇప్పుడు మీరు సన్ముఖములో వింటున్నారు. వారు కేవలం మాట వరసకు సర్వాత్మల తండ్రి ఒక్కరే, ఆ ఒక్కరినే అందరూ స్మృతి చేస్తారని చెప్తారు. స్త్రీ-పురుషులు ఇరువురూ ఆత్మలే. ఈ లెక్కన అందరూ సోదరులే, తర్వాత సోదరీ-సోదరులుగా అవుతారు, ఆ తర్వాత స్త్రీ-పురుషులుగా అవుతారు. కనుక తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మలు, పరమాత్మ చాలా కాలము నుండి వేరుగా ఉన్నారు... అని గాయనము కూడా ఉంది. నదులు, సాగరము చాలా కాలము నుండి వేరుగా ఉన్నాయని.... అనరు. పెద్ద-పెద్ద నదులైతే సాగరముతో కలిసే ఉంటాయి. నది సాగరునికి పుత్రిక అని కూడా పిల్లలకు తెలుసు. సాగరము నుండి నీరు వస్తుంది, మేఘాల ద్వారా పర్వతాలపై వర్షము కురుస్తుంది. ఆ నీరు మళ్ళీ నదిగా అవుతుంది. కనుక నదులన్నీ సాగరుని పుత్రులు, పుత్రికలే. చాలా మందికి నీరు ఎక్కడ నుండి వస్తుందో కూడా తెలియదు. ఇది కూడా నేర్పించబడ్తుంది. జ్ఞానసాగరులు ఒక్క తండ్రి మాత్రమే అని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. అంతేకాక మీరంతా ఆత్మలు, తండ్రి ఒక్కరే అని కూడా అర్థం చేయించడం జరుగుతుంది. ఆత్మ కూడా నిరాకారియే, కాని సాకారములోకి వచ్చినప్పుడు పునర్జన్మలు తీసుకుంటుంది. తండ్రి కూడా సాకారములోకి వచ్చినప్పుడే కలుస్తారు. తండ్రిని కలవడం ఒక్కసారే జరుగుతుంది. ఈ సమయములో వచ్చి అందరినీ కలిసారు. వారే భగవంతుడని కూడా అందరూ తెలుసుకుంటారు. గీతలో కృష్ణుని పేరు వేసేశారు కాని కృష్ణుడు ఇక్కడకు రాలేరు. వారెలా నిందింపబడతారు? ఈ సమయములో కృష్ణుని ఆత్మ ఇక్కడుందని మీకు తెలుసు. మొట్టమొదట మీకు ఆత్మ జ్ఞానము లభిస్తుంది. మీరు ఆత్మలు, ఇంత కాలము శరీరమని భావించి నడుస్తూ వచ్చారు, ఇప్పుడు తండ్రి వచ్చి దేహీ అభిమానులుగా చేస్తున్నారు. సాధువులు-సత్పురుషులు మొదలైనవారెవరూ మిమ్మల్ని దేహీ అభిమానులుగా చేయలేరు. మీరంతా పిల్లలు, మీకు అనంతమైన తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. మేము పరంధామములో ఉండేవారము, ఇక్కడకు పాత్ర అభినయించేందుకు వచ్చామని ఇప్పుడు మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడిక నాటకము పూర్తవుతుంది. ఈ డ్రామా ఎవరూ తయారుచేసింది కాదు. ఈ డ్రామా తయారై తయారవుతున్నది. ఈ డ్రామా ఎప్పటి నుండి ప్రారంభమయింది అని మిమ్మల్ని అడుగుతారు. ఇది అనాది డ్రామా. దీనికి ఆది-అంత్యము లేదని చెప్పండి. అయితే పాతదే కొత్తదిగా, మళ్ళీ కొత్తది పాతదిగా అవుతుంది. పిల్లలైన మీకు ఈ పాఠము పక్కాగా ఉంది. కొత్త ప్రపంచం ఎప్పుడు అవుతుందో, మళ్ళీ అది పాతదిగా ఎప్పుడు అవుతుందో మీకు తెలుసు. ఇది కూడా పూర్తిగా కొంతమంది బుద్ధిలో మాత్రమే ఉంది. ఇప్పుడు నాటకము పూర్తి అవుతుందని, అది మళ్ళీ రిపీట్ అవుతుందని మీకు తెలుసు. అంటే మన 84 జన్మల పాత్ర పూర్తయ్యింది. ఇప్పుడు తండ్రి మనల్ని తీసుకెళ్ళేందుకు వచ్చారు. తండ్రి గైడ్ కూడా కదా. మీరందరూ పండాలు. పండాలు యాత్రికులను తీసుకెళ్తారు. వారు దైహిక పండాలు, మీరు ఆత్మిక పండాలు, అందుకే మీకు పాండవ గవర్నమెంటు అన్న పేరు కూడా ఉంది, కాని అది గుప్తము. పాండవులు, కౌరవులు, యాదవులు ఏం చేస్తారు? ఇది ఇప్పటి విషయమే, మహాభారత యుద్ధము జరిగిన సమయము ఇదే. అనేక ధర్మాలున్నాయి, ప్రపంచము కూడా తమోప్రధానంగా ఉంది, వెరైటీ ధర్మాల వృక్షం పూర్తిగా పాతదైపోయింది. ఆదిసనాతన దేవీదేవతా ధర్మమే ఈ వృక్షానికి మొట్టమొదటి పునాది. సత్యయుగములో కొంతమంది మాత్రమే ఉంటారు, తర్వాత వృద్ధి చెందుతారు. ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు, మీలో కూడా నంబరువారీగా ఉన్నారు. విద్యార్థులలో కొంతమంది మంచి తెలివిగలవారుంటారు, మంచి ధారణ చేస్తారు మరియు చేయించేందుకు కూడా అభిరుచి ఉంటుంది. కొంతమంది మంచిరీతిలో ధారణ చేస్తారు. కొంతమంది మధ్యస్థంగా, కొంతమంది మూడవ, కొంతమంది నాల్గవ తరగతికి చెందినవారిగా ఉంటారు. ప్రదర్శినీలో అయితే రిఫైన్ పద్ధతిలో అర్థం చేయించేవారు కావాలి. మొదట ఇద్దరు తండ్రులున్నారని చెప్పండి. ఒకరు అనంతమైన పారలౌకిక తండ్రి, రెండవవారు హద్దు యొక్క లౌకిక తండ్రి. భారతదేశానికి అనంతమైన వారసత్వము లభించి ఉన్నది. భారతదేశము స్వర్గముగా ఉండేది, అది తర్వాత నరకంగా అయ్యింది, దీనిని ఆసురీ రాజ్యమని అంటారు. మొట్టమొదట భక్తి కూడా అవ్యభిచారిగా ఉంటుంది. ఒక్క శివబాబానే స్మృతి చేస్తారు.

తండ్రి చెప్తున్నారు - పిల్లలూ, పురుషోత్తములుగా అవ్వాలి కనుక కనిష్ఠంగా తయారుచేసే విషయాలను వినకండి. ఒక్క తండ్రి ద్వారానే వినండి. అవ్యభిచారి జ్ఞానాన్ని వినండి. ఇతరులందరి ద్వారా ఏదైతే వింటారో అదంతా అసత్యము. తండ్రి ఇప్పుడు మీకు సత్యము వినిపించి పురుషోత్తములుగా తయారుచేస్తారు. చెడు విషయాలను వింటూ-వింటూ మీరు కనిష్ఠులుగా అయ్యారు. ప్రకాశం అనగా బ్రహ్మా పగలు, అంధకారం అనగా బ్రహ్మా రాత్రి. ఈ పాయింట్లన్నీ ధారణ చేయాలి. ప్రతి విషయములో నంబరువారుగా ఉండనే ఉంటారు. కొందరు డాక్టర్లు ఒక్క ఆపరేషన్ కి 10-20 వేల రూపాయలు తీసుకుంటారు, కొంతమందికి తినేందుకు కూడా ఉండదు. బ్యారిస్టర్లు కూడా అలాగే ఉంటారు. మీరు కూడా ఎంతగా చదువుకొని చదివిస్తారో అంత ఉన్నత పదవిని పొందుతారు. తేడా ఉంటుంది కదా. దాస-దాసీలలో కూడా నంబరువారుగా ఉంటారు. ఆధారమంతా చదువుపైనే ఉంది. నేనెంత బాగా చదువుకుంటున్నాను, భవిష్యత్తులో జన్మ జన్మాంతరాలు ఎలా తయారవుతాను, అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. జన్మ జన్మాంతరాలు ఎలా తయారవుతారో, కల్ప-కల్పాంతరాలు అలానే తయారవుతారు, కనుక చదువుపై పూర్తిగా అటెన్షన్ పెట్టాలి. విషము త్రాగడం పూర్తిగా వదిలేయాల్సి ఉంటుంది. సత్యయుగములో మురికి పట్టిన వస్త్రాలను శుభ్రము చేసేవారు అని అనడం జరగదు. ఈ సమయములో అందరి దేహాలు మురికి పట్టి పాడై ఉన్నాయి. తమోప్రధానంగా ఉన్నాయి కదా. ఇవన్నీ అర్థం చేయించే విషయాలు కదా. అందరికంటే పాత శరీరాలు ఎవరివి? మనవే. మనము ఈ శరీరాలను మారుస్తూ ఉంటాము. ఆత్మ పతితమవుతూ ఉంటుంది. శరీరము కూడా పతితంగా, పాతగా అవుతూ ఉంటుంది. శరీరాన్ని మార్చవలసి వస్తుంది. ఆత్మ మారదు. శరీరానికి వృద్ధాప్యం వస్తుంది, మృత్యువు జరుగుతుంది - ఇది కూడా డ్రామా తయారై ఉంది. అందరికీ పాత్రలున్నాయి. ఆత్మ అవినాశి. ఆత్మ స్వయం "నేను శరీరాన్ని వదిలేస్తాను” అని చెప్తుంది. దేహీ-అభిమానులుగా అవ్వవలసి వస్తుంది. మనుష్యులందరూ దేహాభిమానులుగా ఉన్నారు. అర్ధకల్పము దేహాభిమాని, అర్ధకల్పము దేహీ అభిమాని.

దేహీ అభిమానులుగా అయినందుకు సత్యయుగములోని దేవతలకు మోహజీతులనే టైటిల్ లభించింది, ఎందుకంటే అక్కడ మేము ఆత్మలమని, ఇప్పుడీ శరీరాన్ని వదిలి మరొకటి తీసుకోవాలని వారు భావిస్తారు. మోహజీత్ రాజు కథ కూడా ఉంది కదా. దేవీ దేవతలు మోహజీతులుగా ఉంటారని తండ్రి అర్థం చేయిస్తారు. సంతోషముగా ఒక శరీరమును వదలి మరొకటి తీసుకోవాలి. పిల్లలకు తండ్రి ద్వారా పూర్తి జ్ఞానము లభిస్తుంది. మీరే ఈ చక్రమంతా తిరిగి, ఇప్పుడు మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. ఎవరెవరు ఇతర ధర్మాలలోకి కన్వర్ట్ అయ్యారో, వారు కూడా వచ్చి కలుస్తారు. కొద్దో-గొప్పో తమ వారసత్వాన్ని తీసుకుంటారు. ధర్మమే మారిపోయింది కదా. ఆ ధర్మములో ఎంత కాలం ఉన్నారో తెలియదు. 2-3 జన్మలు తీసుకోవచ్చు. ఎవరైనా హిందువుల నుండి ముసల్మానులుగా అయితే మళ్ళీ ఆ ధర్మములోకే వస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడకు వస్తారు. ఇవన్నీ విస్తారమైన విషయాలు. ఇన్ని విషయాలు గుర్తుంచుకోలేకపోతే కనీసం స్వయాన్ని తండ్రికి సంతానం అని అయినా భావించమని తండ్రి చెప్తున్నారు. మంచి-మంచి పిల్లలు కూడా మర్చిపోతారు. తండ్రిని స్మృతే చేయరు. మాయ ఇందులో మరపింపజేస్తుంది. మొదట మీరు కూడా మాయకు బానిసలే కదా. ఇప్పుడు ఈశ్వరునికి చెందినవారిగా అయ్యారు. అది కూడా డ్రామాలో పాత్ర. ఇప్పుడు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి. ఎప్పుడైతే ఆత్మలైన మీరు మొట్టమొదట శరీరములోకి వచ్చారో, అప్పుడు పవిత్రంగా ఉండేవారు, తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ పతితమైపోయారు. ఇప్పుడు మళ్ళీ నిర్మోహులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. ఈ శరీరముపై కూడా మోహముండకూడదు.

ఇప్పుడు పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచముపై అనంతమైన వైరాగ్యము కలుగుతుంది ఎందుకంటే ఈ ప్రపంచములోని వారంతా పరస్పరము దుఃఖమిచ్చుకునేవారే, కనుక ఈ పాత ప్రపంచమునే మర్చిపోండి. మనము అశరీరులుగా వచ్చాము, మళ్ళీ అశరీరులుగా అయి తిరిగి వెళ్ళాలి. ఇప్పుడీ ప్రపంచమే సమాప్తమవ్వనున్నది. తమోప్రధానము నుండి సతోప్రధానంగా అయ్యేందుకు నిరంతరం నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు. నన్నొక్కరినే స్మృతి చేయమని కృష్ణుడు చెప్పలేరు. కృష్ణుడు సత్యయుగములో ఉంటారు. నన్ను మీరు పతిత పావనులని కూడా అంటారు, ఇప్పుడు నన్నొక్కరినే స్మృతి చేయండి. పావనంగా అయ్యేందుకు నేను ఈ యుక్తిని మీకు చెప్తున్నాను. కల్ప-కల్పము యొక్క యుక్తిని చెప్తున్నాను, ప్రపంచము పాతదిగా అయినప్పుడు భగవంతుడు రావలసి వస్తుంది. మనుష్యులు డ్రామా ఆయువుని చాలా పెద్దదిగా చేసేశారు. కనుక మనుష్యులు పూర్తిగా మర్చిపోయారు. ఇది సంగమయుగమని ఇప్పుడు మీకు తెలుసు, ఇదే పురుషోత్తములుగా అయ్యే యుగమని మీకు తెలుసు. మనుష్యులు పూర్తి ఘోరమైన అంధకారములో ఉన్నారు. ఈ సమయంలో అందరూ తమోప్రధానంగా ఉన్నారు. ఇప్పుడు మీరు తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవుతారు. అందరికంటే ఎక్కువ భక్తి చేసింది కూడా మీరే. ఇప్పుడు భక్తి మార్గము సమాప్తమైపోతుంది. భక్తి మృత్యులోకములో ఉంటుంది. తర్వాత మళ్ళీ అమరలోకము వస్తుంది. మీరు ఈ సమయములో జ్ఞానము తీసుకుంటారు, తర్వాత భక్తి యొక్క నామ-రూపాలే ఉండవు. "ఓ భగవంతుడా, ఓ రామా", ఇవన్నీ భక్తి మార్గము యొక్క పదాలు. ఇందులో ఎటువంటి శబ్దము చేయకూడదు. తండ్రి జ్ఞానసాగరులు, శబ్దము ఏ మాత్రము చేయరు కదా. వారిని సుఖశాంతుల సాగరులని అంటారు. అయితే వినిపించేందుకు కూడా వారికి శరీరము కావాలి కదా. భగవంతుని భాష ఏమిటో, ఎవ్వరికీ తెలియదు. బాబా అన్ని భాషలలో మాట్లాడ్తారని కాదు. అలా మాట్లాడరు. వారి భాష హిందీ. బాబా ఒక్క భాషలోనే అర్థము చేయిస్తారు. దానిని అనువాదము చేసి మీరు అర్థం చేయిస్తారు. విదేశీయులు మొదలైనవారు ఎవరు మిమ్మల్ని కలిసినా వారికి తండ్రి పరిచయమునివ్వాలి. ఇప్పుడు తండ్రి ఆదిసనాతన దేవీదేవతా ధర్మాన్ని స్థాపన చేస్తున్నారు. త్రిమూర్తి చిత్రంపై అర్థం చేయించాలి. ప్రజాపిత బ్రహ్మాకు ఎంతమంది బ్రహ్మాకుమారులు-కుమారీలున్నారు! ఎవరు వచ్చినా మొదట వారిని మీరు ఎవరి వద్దకు వచ్చారు అని అడగండి. బయట ప్రజాపిత అని బోర్డు పెట్టి ఉంది కదా... వారు రచించేవారు అయ్యారు. కాని వారిని భగవంతుడని అనడం జరగదు. నిరాకారుడిని మాత్రమే భగవంతుడని అంటారు. ఈ బ్రహ్మాకుమారులు-కుమారీలు అందరూ బ్రహ్మా సంతానము. మీరు ఇక్కడకు ఎందుకు వచ్చారు? మా తండ్రితో మీకేం పని! పిల్లలకు తండ్రితోనే కదా పని ఉండేది. మాకు తండ్రి గురించి బాగా తెలుసు. సన్ షోస్ ఫాదర్ (కుమారుడు తండ్రిని ప్రత్యక్షము చేస్తారు) అనే గాయనముంది. మనము వారి పిల్లలము. అచ్ఛా.

మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. పురుషోత్తములుగా అయ్యేందుకు కనిష్ఠులుగా తయారుచేసే ఏ విధమైన చెడు మాటలను వినకూడదు. ఒక్క తండ్రి ద్వారానే అవ్యభిచారి జ్ఞానమును వినాలి.

2. నిర్మోహులుగా అయ్యేందుకు దేహీ-అభిమానులుగా అయ్యే పురుషార్థము పూర్తిగా చేయాలి. ఇది పాత దుఃఖమిచ్చే ప్రపంచము అని బుద్ధిలో ఉండాలి, దీనిని మర్చిపోవాలి. దీనిపై అనంతమైన వైరాగ్యముండాలి.

వరదానము:-

"ఫాలో ఫాదర్” (తండ్రిని అనుసరించండి) అనే పాత్ర ద్వారా కష్టాన్ని సులభంగా తయారుచేసుకునే తీవ్రపురుషార్థీ భవ

కష్టాన్ని సులభంగా చేసుకునేందుకు లేక చివరి పురుషార్థములో సఫలతను ప్రాప్తి చేసుకునేందుకు మొదటి పాఠము - "ఫాలో ఫాదర్”, ఈ మొదటి పాఠమే చివరి స్టేజ్ ను సమీపంగా తీసుకొస్తుంది. ఈ పాఠం ద్వారా పొరపాట్లు లేనివారిగా, ఏకరసంగా, తీవ్రపురుషార్థులుగా అవుతారు ఎందుకంటే ఏ విషయంలోనైనా ఫాలో చేసేందుకు బదులుగా, సొంత బుద్ధిని నడిపించినప్పుడే కష్టమనిపిస్తుంది. దీని ద్వారా మీరు మీ సంకల్పాలనే వలలో చిక్కుకుంటారు, అప్పుడు సమయం కూడా పడ్తుంది, శక్తి కూడా పడ్తుంది. ఒకవేళ ఫాలో చేస్తూ ఉంటే సమయం మరియు శక్తి రెండూ మిగులుతాయి, జమ అవుతాయి.

స్లోగన్:-

సత్యతను, స్వచ్ఛతను ధారణ చేసేందుకు మీ స్వభావాన్ని సరళంగా చేసుకోండి.