ఓంశాంతి. పిల్లలు ఏం విన్నారు? పిల్లల మనసు ఎవరిపై ఉంది? గైడ్(మార్గదర్శకుడు) పై. గైడ్ ఏమేం చూపిస్తారు? స్వర్గానికి వెళ్ళే దారి చూపిస్తారు. పిల్లలకు దాని పేరు కూడా "స్వర్గానికి ద్వారము” అని ఇవ్వబడింది. స్వర్గ ద్వారమెప్పుడు తెరుస్తారు? ఇప్పుడిది నరకము కదా. స్వర్గానికి వెళ్ళే గేటు ఎప్పుడు, ఎవరు తెరుస్తారో పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మీకు స్వర్గానికి వెళ్ళే దారి తెలుసు కనుక మీరు సదా సంతోషంగా ఉంటారు. ప్రదర్శినీలు, మేళాల ద్వారా మీరు మనుష్యులకు స్వర్గ ద్వారం వద్దకు ఎలా వెళ్ళాలో చూపిస్తారు. మీరు చిత్రాలైతే చాలా తయారుచేశారు. బాబా అడుగుతున్నారు - ఈ చిత్రాలన్నిటిలో ఏ చిత్రము ద్వారా మనము ఎవరికైనాసరే స్వర్గానికి వెళ్ళే గేటు గురించి అర్థంచేయించగలము? సృష్టిచక్ర చిత్రము ద్వారా స్వర్గానికి వెళ్ళే గేటు స్పష్టమౌతుంది. ఇదే సరియైన గేటు. పైన ఒకవైపు నరకానికి గేటు, మరోవైపు స్వర్గానికి గేటు ఉంది. చాలా స్పష్టంగా ఉంది. ఇక్కడ నుండి ఆత్మలన్నీ శాంతిధామానికి పరుగెత్తుతాయి, తర్వాత స్వర్గంలోకి వస్తాయి. దీనిని గేటు అని అంటారు. చక్రమునంతా కలిపి గేటు అని అనరు. పై భాగమున చూపబడిన సంగమయుగమే గేటు. ఆ గేటు ద్వారా ఆత్మలు పైకి వెళ్ళిపోయి మళ్ళీ కొత్త ప్రపంచములోకి వస్తాయి. మిగిలిన ఆత్మలన్నీ శాంతిధామములో ఉంటాయి. ఆ ముల్లు ఇది నరకము, ఇది స్వర్గము అని చూపిస్తుంది. అర్థము చేయించేందుకిది చాలా ఫస్ట్ క్లాస్ చిత్రము. స్వర్గానికి దారి అని చాలా స్పష్టంగా ఉంది. ఇది బుద్ధితో అర్థము చేసుకునే విషయము కదా. అనేక ధర్మాల వినాశనము, ఒకే ధర్మ స్థాపన జరుగుతుంది. మనము సుఖధామానికి వెళ్తామని మీకు తెలుసు. మిగిలిన వారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. గేటు అయితే చాలా స్పష్టంగా ఉంది. ఈ సృష్టి చక్రమే చాలా ముఖ్యమైన చిత్రము. ఇందులో నరక ద్వారము, స్వర్గ ద్వారము చాలా స్పష్టంగా ఉన్నాయి. కల్పక్రితము వెళ్ళినవారే స్వర్గ ద్వారములోకి వెళ్తారు. మిగిలినవారంతా శాంతి ద్వారానికి వెళ్ళిపోతారు. నరక ద్వారము మూసుకొని శాంతి ద్వారము, సుఖ ద్వారము రెండూ తెరుచుకుంటాయి. ఇది అన్నిటికంటే ఫస్ట్ క్లాస్ చిత్రము. బాబా ఎప్పుడూ, ఒకటి త్రిమూర్తి, రెండు గోళాలు(స్వర్గము, నరకము), సృష్టి చక్రము ఫస్ట్ క్లాస్ చిత్రాలని చెప్తూ ఉంటారు. ఎవరు వచ్చినా మొదట వారికి ఈ చిత్రాన్ని చూపించి, ఇది స్వర్గములోకి వెళ్ళే ద్వారము అని చెప్పండి. ఇది నరకము, అది స్వర్గము. ఇప్పుడు నరకము వినాశనమవుతుంది. ముక్తిధామానికి వెళ్ళే గేటు తెరుచుకుంటుంది. ఈ సమయములో మనము స్వర్గములోకి వెళ్తాము. మిగిలినవారంతా శాంతిధామములోకి వెళ్తారు. ఎంత సులభము! అందరూ స్వర్గ ద్వారములోకి వెళ్ళరు. అక్కడ ఈ దేవీ దేవతల రాజ్యమే ఉండేది. స్వర్గ ద్వారములోకి వెళ్ళేందుకు ఇప్పుడు మనము అర్హులుగా అయ్యామని మీ బుద్ధిలో ఉంది. ఎంత బాగా చదువుకుంటారో, వ్రాసుకుంటారో అంత నవాబులుగా అవుతారు. ఆట పాటల్లో మునిగిపోతే పాడవుతారు. ఈ సృష్టి చక్రము చిత్రము అన్నిటికంటే మంచిది. ఒక్కసారి చిత్రము చూస్తూనే బుద్ధితో అర్థము చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏ చిత్రము చూపించి మంచి రీతిగా అర్థం చేయించగలమో రోజంతా ఆలోచిస్తూ ఉండాలి. గేట్ వే టు హెవెన్ (స్వర్గ ద్వారము) అనే ఈ ఇంగ్లీషు పదము చాలా బాగుంది. ఇప్పుడైతే అనేక భాషలైపోయాయి. హిందీ అనే పదము హిందుస్థాన్ నుండి వచ్చింది. హిందుస్థాన్ అనే పదము సరియైనది కాదు. దాని అసలు పేరు భారత్. భారత ఖండమని అంటారు. వీధులు మొదలైనవాటి పేర్లు మారుతుంటాయి. ఖండము పేరు మార్చబడదు. మహాభారత్ అనే పదముంది కదా. అన్నిటిలో భారతదేశమే గుర్తు వస్తుంది. భారత్ మా దేశము అని కూడా పాడుతారు. హిందూ ధర్మమని అన్నందుకు భాష కూడా హిందీ అని అన్నారు. ఇది అన్రైటియస్ (అసత్యము). సత్యయుగములో సత్యమే సత్యముండేది. సత్యంగా ధరించడం, సత్యంగా భుజించడం, సత్యంగా మాట్లాడడం ఉండేది. ఇక్కడ అన్నీ అసత్యమైపోయాయి. గేట్ వే టు హెవెన్ అనే పదము చాలా బాగుంది. మేము మీకు స్వర్గానికి వెళ్ళే ద్వారము చూపిస్తామని చెప్పండి. ఇప్పుడు ఎన్ని భాషలైపోయాయి. పిల్లలైన మీకు తండ్రి సద్గతికి వెళ్ళే శ్రేష్ఠ మతమునిస్తారు. తండ్రి మతానికి "వారి గతి-మతి భిన్నమైనది” అనే గాయనముంది. పిల్లలైన మీకు చాలా సహజమైన మతమునిస్తారు. మీరు భగవంతుని శ్రీమతమునే అనుసరించాలి. డాక్టరు మతమును అనుసరిస్తే డాక్టరుగా అవుతారు. భగవంతుని మతమును అనుసరిస్తే భగవాన్-భగవతిగా అవుతారు. భగవానువాచ అని ఉంది కనుక "మొదట భగవంతుడు ఎవరో నిరూపించి చెప్పండి” అని బాబా చెప్తారు. స్వర్గానికి అధికారులు భగవాన్-భగవతీలే. బ్రహ్మ తత్వములో ఏమీ లేదు. స్వర్గము, నరకము రెండూ ఇక్కడే ఉన్నాయి. స్వర్గము, నరకము పూర్తిగా వేరుగా ఉంటాయి. మానవుల బుద్ధి పూర్తిగా తమోప్రధానమైపోయింది. కొద్దిగా కూడా అర్థము చేసుకోరు. సత్యయుగానికి లక్షల సంవత్సరాలు అన్నారు. కలియుగము ఇంకా 40 వేల సంవత్సరాలుందని అంటారు. పూర్తి గాఢాంధకారంలో ఉన్నారు.
స్వర్గములోకి తీసుకెళ్ళేందుకు తండ్రి మనల్ని ఇటువంటి గుణవంతులుగా చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. ముఖ్యంగా, మనము సతోప్రధానంగా ఎలా అవ్వాలనే చింత ఉండాలి. నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్పారు. నడుస్తూ, తిరుగుతూ, పని చేస్తూ బుద్ధిలో ఇది గుర్తుండాలి. ప్రేయసి-ప్రియుడు కూడా కర్మలైతే చేస్తారు కదా. భక్తిలో కూడా కర్మలైతే చేస్తారు కదా. అయితే బుద్ధిలో వారి స్మృతి ఉంటుంది. స్మృతి చేసేందుకు మాలను తిప్పుతారు. తండ్రి కూడా పదే-పదే చెప్తున్నారు, తండ్రినైన నన్ను స్మృతి చేయండి. సర్వవ్యాపి అని అంటే ఎవరిని స్మృతి చేస్తారు? మీరు ఎంత నాస్తికులుగా అయ్యారనేది తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి గురించే తెలియదు. ఓ గాడ్ ఫాదర్, అని కూడా అంటారు కానీ వారెవరో కొద్దిగా కూడా తెలియదు. ఆత్మ, ఓ గాడ్ ఫాదర్ అని అంటుంది. కానీ ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ వేరు, వారిని పరమ ఆత్మ అనగా సుప్రీం అని అంటారు, ఉన్నతాతి ఉన్నతమైనవారు సుప్రీంసోల్ పరమాత్మ. ఒక్క మనిషికి కూడా ఆత్మ జ్ఞానము తెలియదు. నేను ఆత్మను, ఇది నా శరీరము. రెండు వస్తువులైతే ఉన్నాయి కదా. ఈ శరీరము పంచతత్వాలతో చేయబడింది. ఆత్మ అయితే 'అవినాశి', అది ఒక బిందువు. ఆత్మ దేనితో తయారయ్యింది? అది చాలా చిన్న బిందువు! సాధు సత్పురుషులెవ్వరికీ దీని గురించి తెలియదు. ఇతను చాలా మంది గురువులను ఆశ్రయించారు కాని ఆత్మ అంటే ఏమిటో, పరమపిత పరమాత్మ అంటే ఎవరో ఎవ్వరూ వినిపించలేదు. కేవలం పరమాత్మ గురించే కాదు, వారికి ఆత్మ గురించి కూడా తెలియదు. ఆత్మను తెలుసుకుంటే, పరమాత్మను కూడా వెంటనే తెలుసుకొని ఉండేవారు. పిల్లలు, స్వయాన్ని తెలుసుకొని తమ తండ్రి గురించి తెలుసుకోకుండా ఎలా ఉండగలరు? ఇప్పుడు మీకు ఆత్మ అంటే ఏమిటో, అది ఎక్కడుంటుందో తెలుసు. డాక్టర్లకు కూడా అది సూక్ష్మమైనదని, ఈ కనులతో దానిని చూడలేమని మాత్రము తెలుసు. కనుక ఆత్మను సీసాలలో బంధించినా ఎలా చూడగలరు? ప్రపంచములో మీకున్న జ్ఞానము ఇంకెవ్వరికీ లేదు. ఆత్మ బిందువని, పరమాత్మ కూడా బిందువని మీకు తెలుసు. కాని ఆత్మలైన మీరు పతితుల నుండి పావనంగా, పావనము నుండి పతితంగా అవుతారు. అక్కడ పతితాత్మలు ఉండరు. అక్కడ నుండి అన్ని ఆత్మలు పావనంగానే వస్తాయి. తర్వాత పతితంగా అవుతాయి. మళ్ళీ తండ్రి వచ్చి పావనంగా చేస్తారు. ఇది చాలా సులభంగా అర్థము చేసుకునే విషయము. ఆత్మలమైన మనము 84 జన్మల చక్రములో తిరిగి ఇప్పుడు తమోప్రధానంగా అయ్యామని మీకు తెలుసు. 84 జన్మలు పూర్తిగా తీసుకునేది మనమే అని కూడా మీకు తెలుసు. ఇది కేవలం ఇతనొక్కరి మాటే కాదు. తండ్రి చెప్తున్నారు, నేను అర్థం చేయించేది ఇతనికి, వినేది మీరు. నేను ఇతనిలో ప్రవేశించాను, ఇతనికి వినిపిస్తాను. మీరు వింటారు. వీరు రథము. బాబా 'గేట్ వే టు హెవెన్' అని పేరు పెట్టమని అర్థం చేయించారు కానీ సత్యయుగములో ఉన్న దేవీ దేవతా ధర్మము ఇప్పుడు ప్రాయఃలోపమైపోయిందని అర్థం చేయించాలి. ఎవ్వరికీ తెలియదు. క్రైస్తవులు కూడా మొదట సతోప్రధానంగా ఉండేవారు. తర్వాత పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ తమోప్రధానంగా అయ్యారు. వృక్షము కూడా తప్పకుండా పాతదైపోతుంది. ఇది వెరైటీ ధర్మాల వృక్షము. వృక్షము అనుసారముగా ఇతర ధర్మాల వారందరూ తర్వాతనే వస్తారు. ఇది తయారైన డ్రామా. సత్యయుగములోకి వచ్చే అవకాశము అంత సులువుగా ఎవ్వరికీ లభించదు. ఇది అనాదిగా తయారైన ఆట. సత్యయుగములో ఆది సనాతన ప్రాచీన దేవి దేవతా ధర్మము ఒక్కటే ఉండేది. ఇప్పుడు మనము స్వర్గములోకి వెళ్తున్నామని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఆత్మ, నేను తమోప్రధానంగా ఉన్నాను కనుక ఇంటికి ఎలా వెళ్తాను, స్వర్గానికి ఎలా వెళ్తాను అని అంటుంది. దాని కొరకు సతోప్రధానంగా అయ్యే యుక్తి కూడా తండ్రి చెప్తున్నారు. తండ్రి చెప్తున్నారు, పతిత పావనుడని నన్నొక్కరినే అంటారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. భగవానువాచ అని వ్రాయబడి ఉంది. క్రీస్తు పూర్వము ఇన్ని సంవత్సరాల ముందు భారత దేశము స్వర్గంగా ఉండేదని కూడా అందరూ అంటారు. అయితే స్వర్గమెలా తయారయిందో, అది ఇప్పుడు ఎక్కడకు వెళ్ళిందో ఎవ్వరికీ తెలియదు. మీకైతే ఈ విషయాలు బాగా తెలుసు. ఇంతకుముందు ఈ విషయాలు మీకు కూడా తెలియవు. ఆత్మనే మంచిగా, చెడుగా అవుతూ ఉంటుందని కూడా ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. ఆత్మలందరూ నా పిల్లలే, తండ్రిని స్మృతి చేస్తారు. తండ్రి అందరికీ ప్రియుడు, అందరూ ప్రేయసులు. ఇప్పుడా ప్రియుడు వచ్చారని ప్రేయసులైన మీకు తెలుసు. వారు చాలా మధురమైన ప్రియుడు. లేదంటే అందరూ వారిని ఎందుకు స్మృతి చేస్తారు? నోటి నుండి పరమాత్ముని పేరు వెలువడని మనిషి ఎవ్వరూ ఉండరు. వారి గురించి వివరాలు మాత్రము ఎవ్వరికీ తెలియవు. ఆత్మ అశరీరి అని మీకు తెలుసు. ఆత్మలకు కూడా పూజలు జరుగుతాయి కదా. పూజ్యులుగా ఉన్న మనమే, మన ఆత్మనే పూజించడం మొదలుపెట్టాము. పూర్వజన్మలో బ్రాహ్మణ కులంలో జన్మ తీసుకొని ఉండవచ్చు. శ్రీనాథునికి నైవేద్యము సమర్పిస్తారు కాని తినేది పూజారులు. ఇదంతా భక్తి మార్గము.
స్వర్గ ద్వారము తెరిచేవారు తండ్రి అని పిల్లలైన మీరు అందరికీ అర్థం చేయించాలి. అయితే ఎలా తెరుచుకుంటాయో అర్థం చేయించేది ఎలా? భగవానువాచ అన్నప్పుడు తప్పనిసరిగా శరీరము ద్వారానే మాట్లాడి ఉంటారు కదా. శరీరము ద్వారా మాట్లాడేది, వినేది కూడా ఆత్మనే. ఈ బాబా వివరంగా చెప్తారు. బీజము మరియు వృక్షము ఉన్నాయి. ఇది కొత్త వృక్షమని పిల్లలైన మీకు తెలుసు. మెల్ల-మెల్లగా వృద్ధి చెందుతుంది. మీ ఈ క్రొత్త వృక్షము చాలా మధురమైనది కనుక పురుగు కూడా చాలా పడుతుంది. తీయని వృక్షాలకే పురుగులు మొదలైనవి పడతాయి కనుక మందులు వేస్తారు. అలాగే తండ్రి కూడా మనకు మన్మనాభవ అనే చాలా మంచి మందు ఇచ్చారు. 'మన్మనాభవ' గా లేనందుకు పురుగులు తినేస్తాయి. పురుగులు పట్టిన వస్తువు ఎందుకు పనికొస్తుంది? దానిని పారేస్తారు. ఉన్నత పదవి ఎక్కడ? నీచ పదవి ఎక్కడ? వ్యత్యాసముంది కదా. మధురమైన పిల్లలకు, చాలా మధురాతి మధురంగా అవ్వమని అర్థం చేయిస్తూ ఉంటారు. ఎవరితోనూ ఉప్పునీరుగా అవ్వకండి, క్షీరఖండమువలే (పాలు పంచదార వలే కలిసిమెలిసి) ఉండండి. అక్కడ పులి, మేక కూడా క్షీరఖండమువలె ఉంటాయి. కనుక పిల్లలు కూడా క్షీర ఖండముగా అవ్వాలి. కాని భాగ్యములో లేకపోతే పురుషార్థము కూడా ఏం చేస్తారు? పాస్ అవ్వలేరు. భాగ్యాన్ని ఉన్నతంగా చేసేందుకు టీచరు చదివిస్తారు. టీచర్ అయితే అందరినీ చదివిస్తారు. వ్యత్యాసము కూడా మీరు చూస్తారు. ఎవరు ఏ సబ్జక్టులో తెలివైనవారుగా ఉన్నారో క్లాసులో విద్యార్థులు తెలుసుకోగలరు. ఇక్కడ కూడా అలాగే ఉంది. స్థూల సేవ అనే సబ్జెక్టు కూడా ఉంది కదా. ఉదాహరణకు వంటచేసేవారు ఉన్నారు, వారి ద్వారా చాలా మందికి సుఖము లభిస్తుంది, ఎంతగా అందరూ జ్ఞాపకం చేసుకుంటారు. ఈ సబ్జెక్టు ద్వారా కూడా మార్కులు అయితే లభిస్తాయి. కాని గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులు అవ్వాలంటే కేవలం ఒక్క సబ్జెక్టులోనే కాదు, అన్ని సబ్జెక్టులపై పూర్తి అటెన్షన్ పెట్టాలి. జ్ఞానము కూడా ఉండాలి, నడవడిక కూడా బాగుండాలి, దైవీగుణాలు కూడా ఉండాలి. అటెన్షన్ పెట్టడం మంచిది. వంటచేసేవారి వద్దకు కూడా ఎవరైనా వస్తే, వారికి "మన్మనాభవ” అని చెప్పాలి. శివబాబాను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి, మీరు స్వర్గానికి అధికారులుగా అవుతారని చెప్పండి. తండ్రిని స్మృతి చేస్తూ, ఇతరులకు కూడా పరిచయమునిస్తూ ఉండండి. జ్ఞానము, యోగము రెండూ ఉండాలి. చాలా సులువు. ఇదే ముఖ్యమైన విషయము. అంధులకు చేతికర్రగా అవ్వాలి. ప్రదర్శినీకు ఎవరినైనా తీసుకువెళ్ళి వారికి, పదండి, మేము మీకు స్వర్గ ద్వారము చూపిస్తాము అని చెప్పండి. ఇది నరకము, అది స్వర్గము అని చెప్పండి. తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి, పవిత్రంగా అయితే మీరు పవిత్ర ప్రపంచానికి అధికారులుగా అవుతారు. ఇదే మన్మనాభవ. కల్పక్రితము వలె బాబా మీకు గీత వినిపిస్తారు. అందుకే బాబా - "గీతా భగవానుడెవరు?” అనే చిత్రాన్ని తయారుచేయించారు. స్వర్గ ద్వారాలు తెరిచేదెవరు? శివబాబాయే తెరుస్తారు. కృష్ణుడు ఆ ద్వారము ద్వారా వెళ్తారు. అందుకే పొరపాటున గీతా భగవానుడని కృష్ణుని పేరు పెట్టేశారు. ముఖ్యమైన చిత్రాలు రెండే. మిగిలినవన్నీ వాటి విస్తారమే. పిల్లలు చాలా మధురంగా తయారవ్వాలి. ప్రేమగా మాట్లాడాలి. మనసా, వాచా, కర్మణా అందరికీ సుఖమునివ్వాలి. చూడండి, వంటచేసేవారు అందరినీ సంతోషపెడతారు కనుక వారికి కానుకలు కూడా తీసుకొస్తారు. ఇది కూడా ఒక సబ్జక్టే కదా. కానుకలు తీసుకొస్తారు, కానీ మీ నుండి నేనెందుకు తీసుకోవాలి, తీసుకుంటే మీరే గుర్తుకొస్తారు అని వారు అంటారు. శివబాబా భండారము నుండి లభిస్తే మాకు శివబాబాయే గుర్తుంటారు అని చెప్తారు.అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మీ భాగ్యాన్ని శ్రేష్ఠంగా తయారుచేసుకునేందుకు పరస్పరము చాలా-చాలా క్షీరఖండము వలె, మధురంగా ఉండాలి. ఎప్పుడూ ఉప్పునీరుగా అవ్వకూడదు. అన్ని సబ్జెక్టులపై పూర్తి అటెన్షన్ పెట్టాలి.
2. సద్గతి కొరకు తండ్రి నుండి ఏ శ్రేష్ఠ మతము లభించిందో దానిని అనుసరించాలి మరియు అందరికీ శ్రేష్ఠ మతమునే వినిపించాలి. స్వర్గములోకి వెళ్ళే దారిని చూపించాలి.