ఓంశాంతి. ఈ పాట తప్పు, ఎందుకంటే మీరు దీపాలైతే కాదు. వాస్తవానికి ఆత్మను దీపమని అనరు. భక్తులు అనేక పేర్లు పెట్టేసారు. తెలియని కారణంగా - 'నేతి-నేతి', మాకు తెలియదు, అని అంటారు, వారు నాస్తికులు. అయినా ఏ పేరు వస్తే ఆ పేరుతో పిలుస్తారు. బ్రహ్మాను దీపమంటారు, అంతేకాక రాయి-రప్పలలో కూడా పరమాత్మ ఉన్నారని అనేస్తారు ఎందుకంటే భక్తిమార్గములో ఎవ్వరూ తండ్రిని యథార్థంగా తెలుసుకోలేరు. తండ్రే స్వయంగా వచ్చి తమ పరిచయమునివ్వవలసి వస్తుంది. శాస్త్రాలు మొదలైనవాటిలో దేనిలోనూ తండ్రి పరిచయము లేదు. అందువలన వారిని నాస్తికులని అంటారు. ఇప్పుడు పిల్లలకు తండ్రి స్వయంగా తమ పరిచయమునిచ్చారు, కాని స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయడంలోనే చాలా బుద్ధి యొక్క పని ఉంది. ఈ సమయంలో అందరూ రాతిబుద్ధి గలవారిగా ఉన్నారు. బుద్ధి ఆత్మలో ఉంది. అవయవాల ద్వారా తెలుస్తుంది - ఆత్మ బుద్ధి బంగారు బుద్ధిగా ఉందా లేక రాతి బుద్ధిగా ఉందా? ఆధారమంతా ఆత్మ పైననే ఉంది. మనుష్యులయితే ఆత్మయే పరమాత్మ అని అంటారు. ఆత్మ నిర్లేపి, కనుక ఏది కావాలంటే అది చేస్తూ ఉండండి అని చెప్తారు. మనుష్యులై ఉండి, తండ్రి ఎవరో తెలియదు. తండ్రి చెప్తున్నారు, మాయా రావణుడు అందరి బుద్ధిని రాతిబుద్ధిగా చేసేశాడు. రోజురోజుకు తమోప్రధానత ఎక్కువవుతూ ఉంది. మాయ జోరు చాలా ఉంది, మార్పు చెందడమే లేదు. పిల్లలకు అర్థం చేయించడం జరుగుతుంది, రాత్రిపూట రోజంతటి లెక్కను తీయండి - ఈ రోజు నేనేం చేశాను? భోజనము దేవతల వలె తిన్నానా? నడవడిక నియమానుసారంగా నడుచుకున్నానా లేక ఏమీ తెలియనివాడి వలె నడుచుకున్నానా? ప్రతిరోజు మీ లెక్కను సంభాళించుకోకపోతే మీ ఉన్నతి ఎప్పుటికీ జరగదు. చాలా మందికి మాయ చెంపదెబ్బలు వేస్తూ ఉంటుంది. ఈ రోజు నా బుద్ధియోగము ఫలానావారి నామ-రూపాలలోకి వెళ్ళింది, ఈ రోజు ఈ పాప కర్మ జరిగింది.... ఇలా సత్యము వ్రాసేవారు కోటిలో కొంతమంది మాత్రమే ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, నేను ఎవరో, ఎలా ఉన్నానో అని నా గురించి అస్సలు తెలియదు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే ఎంతోకొంత బుద్ధిలో కూర్చుంటుంది. తండ్రి చెప్తున్నారు, భలే మంచి-మంచి పిల్లలున్నారు, జ్ఞానము చాలా బాగా వినిపిస్తారు, యోగం ఏమీ లేదు. నా పరిచయం పూర్తిగా లేదు, అర్థము చేసుకోలేరు, అందుకే ఎవ్వరికీ అర్థం చేయించలేరు. ప్రపంచములోని మనుష్యులెవ్వరికీ, రచయిత-రచనల గురించి అస్సలు తెలియదు, అంటే ఏమీ తెలియనట్లే. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయి ఉంది. మళ్ళీ ఇలాగే జరుగుతుంది. 5 వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సమయము వస్తుంది మరియు నేను వచ్చి అర్థం చేయించవలసి వస్తుంది. రాజ్యాధికారము తీసుకోవడం చిన్న విషయము కాదు. ఇందులో చాలా కష్టము ఉంది. మాయ బాగానే దాడి చేస్తుంది, పెద్ద యుద్ధము జరుగుతుంది. బాక్సింగ్ జరుగుతుంది కదా. ఎవరైతే చాలా తెలివిగలవారుంటారో, వారిదే బాక్సింగ్ జరుగుతుంది. ఒకరినొకరు స్పృహ కోల్పోయేలా చేస్తారు కదా. బాబా, మాయ తుఫానులు చాలా వస్తున్నాయి, ఇలా-ఇలా జరుగుతుంది అని చెప్తారు. ఇలా సత్యము వ్రాసేవారు కూడా చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు. దాచి పెట్టేవారు చాలా మంది ఉన్నారు. నేను బాబాకు సత్యమునెలా వినిపించాలి అన్న తెలివి లేదు. ఏ శ్రీమతమును తీసుకోవాలి? వారు వర్ణించలేరు. మాయ చాలా శక్తివంతమయిందని తండ్రికి తెలుసు. సత్యము చెప్పేందుకు చాలా సిగ్గుగా అనిపిస్తుంది. వారి ద్వారా ఎటువంటి కర్మలు జరుగుతాయంటే, అవి తెలిపేందుకు సిగ్గుగా అనిపిస్తుంది. తండ్రి అయితే చాలా గౌరవిస్తూ పైకి తీసుకువస్తారు. వీరు ఎంతో మంచివారు, వీరిని ఆల్ రౌండ్ సేవకు పంపుతానని అంటారు. అంతే, దేహ-అహంకారము వస్తే, మాయతో చెంపదెబ్బ తింటారు, క్రింద పడిపోతారు. బాబా వారిని పైకి ఎత్తేందుకు మహిమ కూడా చేస్తారు. మీరు చాలా మంచి పిల్లలు, స్థూల సేవ కూడా బాగా చేస్తారు అని బుజ్జగించి పైకి ఎత్తుతారు. కానీ యథార్థ రీతిలో కూర్చుని చెప్తున్నారు, గమ్యము చాలా భారీగా ఉంది. దేహము, దేహ సంబంధాలను వదిలి స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి - ఈ పురుషార్థము చేయడం బుద్ధి యొక్క పని. అందరూ పురుషార్థులే. ఎంత గొప్ప రాజ్యము స్థాపనవుతూ ఉంది! తండ్రికి అందరూ పిల్లలూ, విద్యార్థులూ, అలాగే ఫాలోవర్స్ కూడా. వీరు మొత్తం ప్రపంచానికంతా తండ్రి. అందరూ వారినొక్కరినే పిలుస్తారు. వారు వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉంటారు. అయినా వారిపై అంత గౌరవముండదు. పెద్ద-పెద్ద వారు వచ్చినప్పుడు వారికెంత గౌరవమిచ్చి సంభాళన చేస్తారు. ఎంత ఆడంబరము ఉంటుంది. ఈ సమయంలో అందరూ పతితులే. కాని స్వయాన్ని పతితులుగా భావించరు. మాయ పూర్తిగా తుచ్ఛబుద్ధిగా తయారుచేసేసింది. సత్యయుగం ఆయువు చాలా ఎక్కువని చెప్తారు, ఇది 100 శాతము తెలివితక్కువవారిగా అయినట్టే కదా అని తండ్రి చెప్తారు. మనుష్యులు అయి ఉండి ఇంకేమి పని చేస్తారు. 5 వేల సంవత్సరాల మాటను లక్షల సంవత్సరాలని అనేస్తారు! ఇది కూడా తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. 5 వేల సంవత్సరాల క్రితము ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది. వీరు దైవీగుణాల కల మనుష్యులు. అందుకే వారిని దేవతలు అని, ఆసురీ గుణాలు కలవారిని అసురులు అని అంటారు. అసురులకు, దేవతలకు రాత్రికి పగలుకున్నంత తేడా ఉంది. ఎన్ని మారణహొమాలు, కొట్లాటలు జరుగుతున్నాయి! అనేక తయారీలు అవుతూ ఉంటాయి. ఈ యజ్ఞములో మొత్తం ప్రపంచమంతా స్వాహా అవుతుంది. దీనికొరకు ఈ ఏర్పాట్లన్నీ కావాలి కదా. బాంబులు తయారయ్యాయి అంటే తయారైనట్లే, ఇక ఆపడం అన్నది జరగదు. కొద్ది సమయములోనే అందరి వద్దా చాలా తయారవుతాయి, ఎందుకంటే వినాశనమైతే వేగవంతంగా జరగాలి కదా. అప్పుడు ఆసుపత్రులు మొదలైనవేవీ ఉండవు. ఎవ్వరికీ అర్థము కూడా కాదు. పిన్నమ్మ ఇల్లేమీ కాదు. వినాశన సాక్షాత్కారము చిన్న విషయము కాదు. పూర్తి ప్రపంచానికి అంటుకునే అగ్నిని మీరు చూస్తారు. సాక్షాత్కారం జరుగుతుంది - ఎక్కడ చూసినా అగ్నియే అగ్ని అంటుకుని ఉంది. మొత్తం ప్రపంచమంతా సమాప్తమైపోతుంది. ఇది ఎంత పెద్ద ప్రపంచము. ఆకాశమైతే కాలిపోదు. దీనిలో ఏమేమి ఉందో అదంతా వినాశనమైపోతుంది. సత్యయుగానికి, కలియుగానికి రాత్రికి-పగలుకున్నంత తేడా ఉంది. ఎంతమంది మనుష్యులున్నారు, జంతువులున్నాయి, ఎంత సామగ్రి ఉంది. ఇది కూడా పిల్లల బుద్ధిలో కష్టంగా కూర్చుంటుంది. ఆలోచించండి - ఇది 5 వేల సంవత్సరాలనాటి విషయము. దేవీ దేవతల రాజ్యముండేది కదా. అప్పుడు ఎంత కొద్ది మంది మనుష్యులుండేవారు. ఇప్పుడెంతమంది మనుష్యులున్నారు. ఇది కలియుగము. ఇప్పడిది తప్పకుండా వినాశనమవుతుంది.
ఇప్పుడు తండ్రి ఆత్మలకు చెప్తున్నారు, నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. ఇది కూడా అర్థము చేసుకొని స్మృతి చేయాలి. కేవలం శివ-శివ అని చాలా మంది అంటూ ఉంటారు. చిన్న పిల్లలు కూడా అంటారు కాని బుద్ధిలో జ్ఞానము ఏమాత్రము ఉండదు. వారు బిందువని అనుభవంతో చెప్పరు. మనము కూడా చాలా చిన్న బిందువులమే. ఇలా అర్థము చేసుకొని జ్ఞానయుక్తంగా స్మృతి చేయాలి. మొదట నేను ఆత్మను అని పక్కా చేసుకోండి. తర్వాత తండ్రి పరిచయాన్ని బుద్ధిలో బాగా ధారణ చేయండి. అంతర్ముఖులుగా ఉన్న పిల్లలే మేము ఆత్మలము, బిందువులము అని బాగా అర్థము చేసుకోగలరు. ఇప్పుడు మన ఆత్మలకు, మనలో 84 జన్మల పాత్ర ఎలా నిండి ఉందో, మళ్ళీ ఆత్మ సతోప్రధానంగా ఎలా అవుతుందో, ఇప్పుడా జ్ఞానము లభిస్తూ ఉంది. ఇవన్నీ చాలా అంతర్ముఖులుగా అయి అర్థము చేసుకునే విషయాలు. ఇందులోనే సమయం పడుతుంది. ఇది మన అంతిమ జన్మ అని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనము మన ఇంటికి వెళ్తాము. మనము ఆత్మలము అని బుద్ధిలో పక్కాగా ఉండాలి. శరీర భానము తక్కువగా ఉన్నప్పుడే మాట్లాడే పద్ధతిలో పరివర్తన కలుగుతుంది. లేకపోతే నడవడిక పూర్తిగా పాడైపోతుంది. ఎందుకంటే శరీరము నుండి వేరుగా అవ్వరు. దేహాభిమానములోకి వచ్చి ఏదో ఒకటి అనేస్తారు. యజ్ఞముతో చాలా నిజాయితీగా ఉండాలి. ఇప్పుడింకా చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆహారపానీయాలు, వాతావరణము ఏదీ పరివర్తన అవ్వలేదు. ఇంకా చాలా సమయము పడుతుంది. సేవాధారులైన పిల్లలనే బాబా స్మృతి చేస్తారు, పదవి కూడా వారే పొందగలరు. ఊరికినే తమను తాము సంతోషపరచుకోవడం, కేవలం శెనగలు తిన్నట్లవుతుంది. ఇందులో చాలా అంతర్ముఖత అవసరము. ఇతరులకు అర్థం చేయించే యుక్తి కూడా కావాలి. ప్రదర్శినీలో ఎవరూ అర్థము చేసుకోలేరు. కేవలం మీ మాటలు బాగున్నాయని అంటారు. ఇక్కడ కూడా నంబరువారుగా ఉన్నారు. మనము పిల్లలుగా అయ్యాము, తండ్రి నుండి స్వర్గ వారసత్వము లభిస్తుందని నిశ్చయముంది. ఒకవేళ మనము పూర్తిగా తండ్రి సేవ చేస్తూ ఉన్నట్లయితే, ఇదే మన వృత్తి. రోజంతా విచార సాగర మథనము జరుగుతూ ఉంటుంది. ఈ బాబా కూడా విచార సాగర మథనము చేస్తూ ఉంటారు కదా. లేకుంటే ఈ పదవినెలా పొందుతారు! పిల్లలకు, ఇరువురూ కలిసి అర్థము చేయిస్తూ ఉంటారు. రెండు ఇంజన్లు లభించాయి. ఎందుకంటే ఎత్తు చాలా ఉంది కదా. పర్వతాలపైకి వెళ్తున్నప్పుడు రైలు బండికి రెండు ఇంజన్లు తగిలిస్తారు. అప్పుడప్పుడూ వెళ్తూ వెళ్తూ రైలుబండి ఆగిపోతుంది, అప్పుడు జారి క్రిందికి వస్తుంది. మా పిల్లలది కూడా అలాగే ఉంది. ఉన్నతి చెందుతూ-చెందుతూ, శ్రమ చేస్తూ-చేస్తూ పైకి ఎక్కలేరు. మాయా గ్రహణము లేక తుఫాను వస్తూనే పూర్తిగా క్రిందపడి ముక్కలు-ముక్కలుగా అయిపోతారు. కొంచెము సేవ చేసిన వెంటనే అహంకారము వచ్చేస్తుంది, క్రింద పడిపోతారు. వారు తండ్రినేకాక, ధర్మరాజు కూడా అని మర్చిపోతారు. అటువంటివేమైనా చేస్తే మనకు చాలా భారి శిక్ష పడుతుంది. దీనికంటే బయట ఉండడము మంచిది. తండ్రికి చెందినవారిగా అయి వారసత్వము తీసుకోవడం పిన్నమ్మ ఇల్లు కాదు (అంత సులభము కాదు). తండ్రికి చెందినవారిగా అయి మళ్ళీ ఇలాంటి పనులు ఏవైనా చేస్తే తండ్రి పేరును పాడుచేస్తారు. చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. వారసులుగా అవ్వడం పిన్నమ్మ ఇల్లు కాదు (అంత సులభము కాదు). ప్రజలలో కొంతమంది ఎంత ధనవంతులుగా అవుతారంటే, ఇక అడగకండి. అజ్ఞాన కాలములో కొంతమంది మంచిగా ఉంటారు, కొంత మంది వేరేగా ఉంటారు! అయోగ్యులైన పిల్లలకు, నా ఎదురుగా ఉండొద్దు, పక్కకు తప్పుకోండి అని అంటారు. ఇక్కడ ఒకరిద్దరి పిల్లల విషయం కాదు. ఇక్కడ మాయ చాలా శక్తివంతంగా ఉంది. ఇందులో పిల్లలు చాలా అంతర్ముఖులుగా ఉండాలి, అప్పుడు మీరు ఎవరికైనా అర్థం చేయించగలరు. అందరూ మీపై బలిహారమవుతారు, మేము తండ్రిని ఇంతగా నిందిస్తూ వచ్చామని చాలా పశ్చాత్తాపపడతారు. సర్వవ్యాపి అని అనడం లేక స్వయాన్ని ఈశ్వరుడని అనేవారికి తక్కువ శిక్షలు పడవు. అలాగే ఇంటికి వెళ్ళలేరు. వారికయితే ఇంకా కష్టాలు ఉంటాయి. సమయము వచ్చినప్పుడు తండ్రి వీరందరి నుండి లెక్క తీసుకుంటారు. వినాశన సమయములో అందరి లెక్కాచారము సమాప్తమవుతుంది కదా, ఇందులో చాలా విశాల బుద్ధి కావాలి.
మనుష్యులు ఎవరెవరికో శాంతి బహుమతులనిస్తూ ఉంటారు. వాస్తవానికి శాంతిస్థాపన చేసేవారు ఒక్కరే కదా. ప్రపంచములో పవిత్రత-శాంతి-సుఖములు భగవంతుని శ్రీమతమనుసారముగా స్థాపనవుతూ ఉన్నాయిని పిల్లలు వ్రాయాలి. శ్రీమతము ప్రసిద్ధి చెందింది. శ్రీమద్భగవద్గీతా శాస్త్రానికి ఎంత గౌరవమిస్తారు. ఎవరైనా ఎవరి శాస్త్రాన్ని అయినా, మందిరాన్ని అయినా ఏమైనా చేస్తే ఎంతగా గొడవపడ్తారు. ఇప్పుడీ ప్రపంచమంతా కాలి భస్మమైపోతుందని మీకు తెలుసు. ఈ మందిరాలు-మసీదులు మొదలైన వాటిని తగలబెడుతూ ఉంటారు. ఇవన్నీ జరగకముందే పవిత్రంగా అవ్వాలి. ఈ చింత ఏర్పడి ఉండాలి. ఇల్లు-వాకిళ్ళను కూడా సంభాళించాలి. ఇక్కడికి చాలా మంది వస్తారు. ఇక్కడ మేకల వలె ఉంచుకోకూడదు, ఎందుకంటే ఇది అమూల్యమైన జీవితము, వీరిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు మొదలైన వారిని తీసుకురావడం ఆపవలసి ఉంటుంది. ఇంతమంది పిల్లలను ఎలా సంభాళిస్తారు? పిల్లలకు సెలవులు వస్తే, ఇంకెక్కడికి వెళ్తాము, బాబా వద్దకు మధువనానికి వెళ్దామని అనుకుంటారు. అప్పుడు ఇది సత్రము వలె అయిపోతుంది. ఇక యూనివర్సిటి ఎలా అవుతుంది! బాబా అంతా పరిశీలిస్తున్నారు, ఇక ఎవ్వరూ పిల్లలను తీసుకురాకూడదని ఎప్పుడో ఒకప్పుడు ఆర్డరు వేస్తారు. ఈ బంధనాలు కూడా తగ్గిపోతాయి. మాతలపై జాలి కలుగుతుంది. శివబాబా గుప్తంగా ఉన్నారని కూడా పిల్లలకు తెలుసు. ఇతనిపై కూడా కొంతమందికి గౌరవము లేదు. మాకు శివబాబాతో కనక్షన్ అని అనుకుంటారు. ఇతని ద్వారా చెప్పేది శివబాబాయే అన్నది కూడా అర్థం చేసుకోరు. మాయ ముక్కుతో పట్టుకుని తప్పుడు పనులు చేయిస్తూ ఉంటుంది, వదలనే వదలదు. రాజధానిలో అందరూ కావాలి కదా. ఇవన్నీ చివర్లో సాక్షాత్కారమవుతాయి. శిక్షలు కూడా సాక్షాత్కారమవుతాయి. పిల్లలకు మొదట్లో కూడా ఇవన్నీ సాక్షాత్కారమయ్యాయి. అయినా ఏదో ఒక పాప కర్మ చేయడం వదిలిపెట్టరు. చాలా మంది పిల్లలు, మేమైతే థర్డ్ క్లాసుకు చెందినవారిగానే అవ్వాలి అని ముడి వేసుకున్నట్లున్నారు, అందుకే పాపకర్మలు చేయడం మాననే మానరు. వారి శిక్షలను వారే ఇంకా మంచి రీతిగా తయారుచేసుకుంటున్నారు. అర్థం చేయించవలసి వస్తుంది కదా, మేము థర్డ్ క్లాసు వారిగానే అవుతామని ముడి వేసుకోకండి. ఇప్పుడు మేము ఈ లక్ష్మీ-నారాయణులుగా అవ్వాలని ముడి వేసుకోండి. కొంతమంది మంచి ముడి వేసుకుంటారు, ఈరోజు మేము ఏమీ చేయలేదు కదా అని చార్టు వ్రాస్తారు. చాలా మంది ఇటువంటి చార్టు కూడా పెట్టుకునేవారు, వారు ఈ రోజు లేరు. మాయ చాలా సతాయిస్తుంది, ఓడిస్తుంది. అర్ధకల్పము నేను సుఖమిస్తాను. అర్ధకల్పము మాయ దుఃఖమిస్తుంది. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. అంతర్ముఖులుగా అయి శరీర భానానికి అతీతంగా ఉండే అభ్యాసము చేయాలి, ఆహార-పానీయాలను, నడవడికను పరివర్తన చేసుకోవాలి, కేవలం స్వయాన్ని సంతోషపరచుకొని నిర్లక్ష్యంగా అవ్వకూడదు.
2. చాలా ఎత్తుకు వెళ్ళాలి కనుక చాలా-చాలా జాగ్రత్తగా ఉంటూ నడుచుకోవాలి. ఏ కర్మనైనా చాలా సంభాళించుకుంటూ చేయాలి. అహంకారంలోకి రాకూడదు. తప్పుడు కర్మలు చేసి శిక్షలను తయారుచేసుకోకూడదు. మేము ఈ లక్ష్మీనారాయణుల వలె అయ్యే తీరాలి అని ముడి వేసుకోవాలి.