ఓంశాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మలకు అర్థము చేయిస్తున్నారు, వారి పేరేమిటి? శివ. ఇక్కడ కూర్చున్న పిల్లలకిది చాలా బాగా గుర్తుండాలి. ఈ డ్రామాలో అందరి పాత్ర ఇప్పుడు సమాప్తమవుతుంది. నాటకము పూర్తి కావచ్చినప్పుడు మా పాత్ర పూర్తి అవుతుందని, ఇంటికి వెళ్ళాలని పాత్రధారులందరూ భావిస్తారు. పిల్లలైన మీకు కూడా ఇప్పుడు తండ్రి జ్ఞానమునిచ్చారు. ఈ జ్ఞానము ఇతరులెవ్వరిలోనూ లేదు. ఇప్పుడు మిమ్ములను తండ్రి వివేకవంతులుగా చేశారు. పిల్లలూ, ఇప్పుడు నాటకము పూర్తి అవుతుంది. ఇప్పుడు మళ్ళీ చక్రము క్రొత్తగా మొదలవుతుంది. కొత్త ప్రపంచములో సత్యయుగముండేది. ఇప్పుడు పాత ప్రపంచములో ఇది కలియుగ అంతిమ సమయము. ఈ విషయాలు మీకు మాత్రమే తెలుసు అనగా తండ్రి లభించిన వారికి మాత్రమే తెలుసు. క్రొత్తగా వచ్చే వారికి కూడా ఇది అర్థము చేయించాలి - ఇప్పుడు నాటకము పూర్తి అవుతుంది, కలియుగము సమాప్తమైన తర్వాత మళ్ళీ సత్యయుగము రిపీట్ అవుతుంది. ఇప్పుడున్న వారందరూ తిరిగి ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు నాటకము సమాప్తమవుతుందని విన్నప్పుడు ప్రళయము జరుగుతుందని మనుష్యులు భావిస్తారు. ఇప్పుడు పాత ప్రపంచము వినాశనమెలా అవుతుందో మీకు తెలుసు. భారతదేశము అవినాశి ఖండము, తండ్రి కూడా ఇక్కడకే వస్తారు. మిగిలిన అన్ని ఖండాలు సమాప్తమైపోతాయి. ఈ ఆలోచనలు ఇతరులెవ్వరి బుద్ధిలోకి రావు. ఈ నాటకమిప్పుడు పూర్తి అవుతుందని, మళ్ళీ రిపీట్ అవుతుందని పిల్లలైన మీకిప్పుడు తండ్రి అర్థము చేయించారు. ఇంతకుముందు నాటకమనే పేరు కూడా మీ బుద్ధిలో లేదు. మాటవరుసకు మాత్రము ఈ సృష్టి ఒక నాటకము, అందులో మనమంతా పాత్రధారులము అని అనేవారు. ఇదివరకు ఈ మాటలన్నప్పుడు శరీరాలను అంటున్నారు అని భావించేవారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇప్పుడు మనము తిరిగి ఇంటికి వెళ్ళాలి. అది స్వీట్హోమ్. ఆ నిరాకార ప్రపంచములో ఆత్మలైన మనము నివసిస్తాము. ఈ జ్ఞానము ఏ మనిషిలోనూ లేదు. ఇప్పుడు మీరు సంగమయుగములో ఉన్నారు. ఇప్పుడు మనము తిరిగి వెళ్ళాలని మీకు తెలుసు. పాత ప్రపంచము సమాప్తమైతే, భక్తి కూడా సమాప్తమవుతుంది. మొట్టమొదట ఎవరు వస్తారో, ఈ ధర్మాలు నెంబరువారుగా ఎలా వస్తాయో ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. ఈ తండ్రి కొత్త విషయాలను అర్థము చేయిస్తున్నారు. ఇవి ఇతరులెవ్వరు అర్థము చేయించలేరు. తండ్రి కూడా ఒక్కసారి మాత్రమే వచ్చి అర్థము చేయిస్తారు. కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనము చేయవలసి వచ్చినప్పుడు మాత్రమే జ్ఞానసాగరులైన తండ్రి వస్తారు. తండ్రి స్మృతితో పాటు ఈ చక్రము కూడా బుద్ధిలో ఉండాలి. ఇప్పుడు ఈ నాటకము పూర్తి అవుతుంది, మనము ఇంటికి వెళ్తాము. పాత్ర అభినయిస్తూ-అభినయిస్తూ మనము అలసిపోయాము. ధనము కూడా ఖర్చు చేశాము, భక్తి చేస్తూ-చేస్తూ మనము సతోప్రధానము నుండి తమోప్రధానంగా అయ్యాము. ప్రపంచమే పాతదైపోయింది. నాటకాన్ని పాతదని అంటామా? అలా అనము. నాటకము ఎప్పుడూ పాతదిగా అవ్వదు. నాటకము నిత్య నూతనంగా ఉంటుంది. ఇది నడుస్తూనే ఉంటుంది. ప్రపంచము మాత్రము పాతదై, పాత్రధారులైన మనము తమోప్రధానంగా, దుఃఖితులుగా అవుతాము, అలసిపోతాము. సత్యయుగములో అలసిపోము. అక్కడ ఏ విషయములోనూ అలసిపోయే లేక కలత చెందే మాటే ఉండదు. ఇక్కడ అనేక విధాలైన లోపాలు చూడవలసి వస్తుంది. ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నదని మీకు తెలుసు. బంధువులు మొదలైన వారెవ్వరూ గుర్తు రాకూడదు. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. దాని ద్వారా వికర్మలు వినాశనమౌతాయి. వికర్మలు వినాశనమయ్యేందుకు ఏ ఇతర ఉపాయమూ లేదు. గీతలో కూడా మన్మనాభవ అన్న పదముంది. కానీ ఆ పదాన్ని ఎవ్వరూ అర్థము చేసుకోలేరు. తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేయండి, వారసత్వమును స్మృతి చేయండి. మీరు విశ్వానికి వారసులుగా అనగా యజమానులుగా ఉండేవారు. ఇప్పుడు మళ్ళీ మీరు విశ్వానికి యజమానులుగా తయారవుతూ ఉన్నారు. కనుక మీకు ఎంత సంతోషం ఉండాలి. ఇప్పుడు మీరు గవ్వ నుండి వజ్ర సమానంగా తయారవుతూ ఉన్నారు. తండ్రి నుండి వారసత్వము తీసుకునేందుకు మీరు ఇక్కడకు వచ్చారు.
కళలు తగ్గిపోయినప్పుడు పుష్పాలతోట వాడిపోతుందని మీకు తెలుసు. ఇప్పుడు మీరు పుష్పాలతోటగా అవుతారు. సత్యయుగము పుష్పాలతోటగా ఎంతో సుందరంగా ఉండి నెమ్మదిగా కళలు తగ్గిపోతూ వస్తాయి. రెండు కళలు తగ్గిపోతూనే తోట వాడిపోయింది. ఇప్పుడైతే ఇది ముళ్ళ అడవిగా అయిపోయింది. ఈ ప్రపంచానికి ఏమీ తెలియదని ఇప్పుడు మీకు తెలుసు. ఈ జ్ఞానము మీకు లభిస్తుంది. ఇది కొత్త ప్రపంచము కొరకు కొత్త జ్ఞానము. కొత్త ప్రపంచము స్థాపనవుతుంది. స్థాపన చేసేవారు తండ్రి. సృష్టి రచయిత తండ్రి. మీరు వచ్చి స్వర్గ స్థాపన చేయండి అని, ఆ తండ్రినే స్మృతి చేస్తారు. సుఖధామాన్ని స్థాపన చేస్తే దుఃఖధామము తప్పకుండా వినాశనమవుతుంది కదా. బాబా ప్రతిరోజు అర్థము చేయిస్తూ ఉంటారు, దానిని ధారణ చేసి ఇతరులకు అర్థము చేయించాలి. మొట్టమొదట మన తండ్రి ఎవరో వారి నుండి వారసత్వాన్ని ఎలా పొందాలో అర్థము చేయించాలి. భక్తిమార్గములో కూడా గాడ్ ఫాదర్ను - మా దుఃఖాలు హరించి సుఖమును ఇవ్వండి అని స్మృతి చేస్తారు. కనుక పిల్లలైన మీ బుద్ధిలో కూడా స్మృతి ఉండాలి. పాఠశాలలోని విద్యార్థుల బుద్ధిలో జ్ఞానముంటుంది. వారి బుద్ధిలో ఇళ్ళు-వాకిళ్ళు ఉండవు. విద్యార్థి జీవితంలో వృత్తి, వ్యాపారాల మాట కూడా ఉండదు. చదువు మాత్రమే గుర్తుంటుంది. ఇక్కడ కర్మలు చేస్తూ, గృహస్థ వ్యవహారములో ఉంటూ ఈ చదువును చదవమని తండ్రి చెప్తున్నారు. సన్యాసుల వలె ఇళ్ళు-వాకిళ్ళు వదిలేయమని చెప్పరు. ఇది రాజయోగము. ఇది ప్రవృత్తిమార్గము. మీది హఠయోగము అని సన్యాసులకు కూడా మీరు చెప్పవచ్చు. మీరు ఇళ్ళు-వాకిళ్ళు వదులుతారు, ఇక్కడ అలాంటిదేమీ లేదని చెప్పండి. ఈ ప్రపంచము ఎంత మురికిగా ఉందో చూడండి. ఎలా ఉంది! పేదవారు మొదలైనవారు ఎలా నివసిస్తున్నారు! చూసేందుకే అసహ్యమనిపిస్తుంది. విదేశాల నుండి వచ్చిన సందర్శకులకు మంచి-మంచి స్థానాలు చూపిస్తారు. పేదవారు ఉండే మురికి ప్రదేశాలను ఎవరికీ చూపించరు. ఇది ఉన్నదే నరకము కానీ అందులో కూడా చాలా తేడాలున్నాయి కదా, ధనవంతులు నివసించే స్థానాలకు, పేదలు నివసించే స్థానాలకు ఎంతో తేడా ఉంది. కర్మల లెక్కాచారముంది కదా. సత్యయుగములో ఇటువంటి మురికి ఉండదు. అక్కడ కూడా తేడాలు ఉంటాయి కదా! కొంతమంది బంగారు భవనాలు, కొంతమంది వెండి, కొంతమంది ఇటుకల భవనాలు నిర్మించుకుంటారు. ఇక్కడ ఎన్నో ఖండాలున్నాయి. ఒక్క యూరోప్ ఖండమే ఎంత పెద్దది! అక్కడ కేవలం మనము మాత్రమే ఉంటాము. ఇది బుద్ధిలో గుర్తున్నా హర్షితముఖ స్థితి ఉంటుంది. విద్యార్థి బుద్ధిలో చదువు మాత్రమే స్మృతి ఉంటుంది - తండ్రి మరియు వారసత్వము. ఇక కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉందని అర్థము చేయించబడింది. వారేమో లక్షల, వేల సంవత్సరాలని అంటారు. ఇక్కడ 5 వేల సంవత్సరాల విషయమే. ఇప్పుడు మన రాజధాని స్థాపన అవుతూ ఉందని పిల్లలైన మీరు అర్థము చేసుకోగలరు. మిగిలిన ప్రపంచమంతా సమాప్తమవుతుంది. ఇది చదువు కదా. మనము విద్యార్థులమని, మనలను స్వయం భగవంతుడే చదివిస్తున్నారని బుద్ధిలో గుర్తుండాలి. ఈ మాట గుర్తున్నా ఎంతో సంతోషంగా ఉంటుంది. దీనిని ఎందుకు మర్చిపోతారు! మాయ చాలా ప్రబలమైనది, అది మరిపింపజేస్తుంది. పాఠశాలలో విద్యార్థులందరూ చదువుతున్నారు, మనలను భగవంతుడే చదివిస్తున్నారని మీ అందరికీ తెలుసు. అక్కడ అనేక రకాలైన విద్యలు నేర్పిస్తారు. టీచర్లు అనేకమంది ఉంటారు. ఇక్కడ ఉండేది ఒకే టీచరు, ఒకే చదువు. తెలివైన టీచర్లు తప్పకుండా అవసరము. ఉండే పాఠశాల ఒక్కటే. మిగతావన్నీ శాఖలు. చదివించేవారు ఒక్క తండ్రియే. ఆ తండ్రి వచ్చి అందరికీ సుఖమునిస్తారు. అర్ధకల్పము మనము సుఖంగా ఉంటామని మీకు తెలుసు. అందువలన శివబాబాయే మనలను చదివిస్తున్నారన్న సంతోషం ఉండాలి. శివబాబా రచించేదే స్వర్గము. మనము స్వర్గానికి యజమానులుగా అయ్యేందుకు చదువుతున్నాము. లోలోపల ఎంత సంతోషముండాలి! ఆ విద్యార్థులు కూడా తింటూ, త్రాగుతూ ఇంటి పనులు మొదలైనవి చేస్తారు. చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి కొంతమంది హాస్టల్లో ఉంటారు. సేవ చేసేందుకు పిల్లలు బయట ఉంటారు. రకరకాల మనుష్యులు వస్తారు. ఇక్కడైతే మీరు ఎంత సురక్షితంగా కూర్చొని ఉన్నారు! ఎవ్వరూ లోపలికి రాలేరు. ఇక్కడ ఎవరి సాంగత్యమూ లేదు. పతితులతో మాట్లాడే అవసరమే ఉండదు. మీరు ఇతరుల ముఖము చూసే అవసరము కూడా లేదు. అయినా బయట నివసించేవారు వేగంగా ముందుకు వెళ్ళిపోతారు. బయట ఉండేవారు ఎంతోమందిని చదివించి తమ సమానంగా తయారుచేసి తీసుకొస్తారు. ఇది అద్భుతమైన విషయము కదా. ఎటువంటి పేషెంటును తీసుకొచ్చారని బాబా సమాచారాన్ని అడుగుతారు. కొంతమంది చాలా చెడిపోయిన పేషెంట్లు ఉంటారు. వారిని 7 రోజుల భట్టిలో ఉంచుతారు. ఇక్కడకు శూద్రులెవ్వరినీ తీసుకురాకూడదు. ఈ మధువనము బ్రాహ్మణుల గ్రామము వంటిది. ఇక్కడ పిల్లలైన మిమ్ములను విశ్వానికి అధికారులుగా చేసేందుకు తండ్రి కూర్చొని అర్థము చేయిస్తున్నారు. ఎవరైనా శూద్రులను తీసుకొని వస్తే వారు వైబ్రేషన్లను పాడు చేస్తారు. పిల్లలైన మీ నడవడిక కూడా చాలా రాయల్ గా ఉండాలి.
రాను రాను మీకు అక్కడ ఏమేం ఉంటాయో, వాటి సాక్షాత్కారాలు చాలా అవుతూ ఉంటాయి. జంతువులు కూడా చాలా మంచిగా ఉంటాయి. అన్ని వస్తువులు చాలా బాగుంటాయి. సత్యయుగములోని వస్తువు ఇక్కడ ఒక్కటి కూడా ఉండదు. ఇక్కడి వస్తువు సత్యయుగములో ఒక్కటి కూడా ఉండదు. మనము స్వర్గము కొరకు పరీక్ష పాస్ అవుతున్నామని మీకు తెలుసు. ఎంత బాగా చదువుకుంటారో అంత బాగా చదివిస్తారు. టీచర్ గా అయ్యి అందరికీ దారి చూపిస్తారు. అందరూ టీచర్లే. అందరూ చదివించాల్సిందే. మొట్టమొదట తండ్రి పరిచయమిచ్చి ఆ తండ్రి ద్వారా వారసత్వము లభిస్తుందని తెలపాలి. గీతను వినిపించినవారు తండ్రి అని, కృష్ణుడు ఆ తండ్రి ద్వారా విని ఈ పదవిని పొందారని తెలపాలి. ప్రజాపిత బ్రహ్మాతో పాటు బ్రాహ్మణులు కూడా ఇక్కడ కావాలి. బ్రహ్మా కూడా శివబాబా ద్వారా చదువుతున్నారు. విష్ణుపురిలోకి వెళ్ళేందుకు మీరిప్పుడు చదువుకుంటున్నారు. ఇది మీ అలౌకిక ఇల్లు. లౌకికము, పారలౌకికము, ఆ తర్వాత అలౌకికము. కొత్త విషయము కదా. భక్తిమార్గములో బ్రహ్మాను ఎప్పుడూ స్మృతి చేయరు. బ్రహ్మాబాబా అని ఎవ్వరూ అనరూ. దుఃఖము దూరము చేయమని శివబాబాను స్మృతి చేస్తారు. వారు పారలౌకిక తండ్రి, వీరు అలౌకిక తండ్రి. వీరిని మీరు సూక్ష్మవతనములో కూడా చూస్తారు. ఇక్కడ కూడా చూస్తారు. లౌకిక తండ్రి ఇక్కడ మాత్రము కనిపిస్తారు. పారలౌకిక తండ్రిని పరలోకములోనే చూడగలరు. వీరు అద్భుతమైన అలౌకిక తండ్రి, ఈ అలౌకిక తండ్రిని అర్థము చేసుకోవడంలోనే తికమకపడ్తారు. శివబాబానేమో నిరాకారుడని అంటారు. వారు ఒక బిందువని మీరంటారు. వారు అఖండ జ్యోతి అని లేక బ్రహ్మము అని అంటారు. అనేక మతాలున్నాయి. మీదేమో ఒకే మతము. తండ్రి ఈ ఒక్కరి ద్వారా మతమునివ్వడం ప్రారంభించారు. తర్వాత ఇది ఎంత వృద్ధి చెందుతుంది. అందువలన పిల్లలైన మీ బుద్ధిలో ఉండాలి – మమ్ములను శివబాబా చదివిస్తున్నారు, పతితుల నుండి పావనంగా చేస్తున్నారు. రావణ రాజ్యములో పతితులుగా, తమోప్రధానంగా అయ్యే తీరాలి. దీని పేరే పతిత ప్రపంచము. అందరూ దుఃఖితులుగానే ఉన్నారు. అందుకే తండ్రిని - బాబా మా దుఃఖమును దూరము చేసి మాకు సుఖమునివ్వండి అని స్మృతి చేస్తారు. పిల్లలందరికీ తండ్రి ఒక్కరే. వారు అందరికీ సుఖమునే ఇస్తారు కదా. కొత్త ప్రపంచములో సుఖమే సుఖముంటుంది. మిగిలిన వారందరూ శాంతిధామములో ఉంటారు. ఇప్పుడు మనము శాంతిధామములోకి వెళ్తామని మీ బుద్ధిలో ఉండాలి. దగ్గరకు వచ్చే కొలది ఈనాటి ప్రపంచము ఎలా ఉందో రేపటి ప్రపంచము ఎలా ఉంటుందో అంతా చూడగలరు. స్వర్గ రాజ్యాన్ని సమీపంగా చూస్తూ ఉంటారు. అందవలన పిల్లలకు ముఖ్యమైన విషయాన్ని తెలుపుతున్నారు – మేము పాఠశాలలో కూర్చొని చదువుతున్నామని, శివబాబా ఈ రథములో కూర్చొని మమ్ములను చదివించేందుకు వచ్చారని, ఇది భాగ్యశాలి రథమని బుద్ధిలో ఉండాలి. తండ్రి ఒక్కసారి మాత్రమే వస్తారు. భగీరథుడు అనే పేరు ఎవరిదో ఎవ్వరికీ తెలియదు.
పిల్లలైన మీరు తండ్రి సన్ముఖములో కూర్చున్నప్పుడు బాబా వచ్చారని, మనకు సృష్టి చక్ర రహస్యాన్ని తెలియజేస్తున్నారని, ఇప్పుడు నాటకము పూర్తి అవుతుందని, మనము తిరిగి వెళ్ళిపోవాలని బుద్ధిలో ఉండాలి. ఇది బుద్ధిలో పెట్టుకోవడము చాలా సులభము, అయినా ఇది కూడా గుర్తుండదు. ఇప్పుడు చక్రము పూర్తి అవుతుంది. ఇప్పుడు మనము వెళ్ళాలి, మళ్ళీ కొత్త ప్రపంచములోకి వచ్చి పాత్ర అభినయించాలి. మన తర్వాత ఫలానా ఫలానా వారు వస్తారు. ఈ చక్రము ఎలా తిరుగుతూ ఉందో, ప్రపంచము ఎలా వృద్ధి చెందుతూ ఉందో మీకు తెలుసు. కొత్తది నుండి పాతగా మరలా పాత నుండి కొత్తగా అవుతుంది. వినాశనము కొరకు ఏర్పాట్లు కూడా మీరు చూస్తున్నారు. ప్రకృతి భీభత్సాలు కూడా జరుగుతాయి. ఎన్నో బాంబులు తయారుచేసి ఉంచుకున్నారు. తయారుచేసిన బాంబులు ఉపయోగపడాలి కదా. బాంబులతో ఎంత పని జరుగుతుందంటే, ఆ తర్వాత మనుష్యులు యుద్ధము చేసే అవసరమే ఉండదు. సైన్యముతో అవసరముండదు. బాంబులు వేస్తూ ఉంటారు. ఇంతమంది మనుష్యులకు ఉద్యోగాలు లేకపోతే ఆకలితో మరణిస్తారు కదా. ఇవన్నీ జరుగుతాయి. ఆ తర్వాత సిపాయిలు మొదలైనవారు ఏమి చేస్తారు! భూమి కంపిస్తూ ఉంటుంది. బాంబులు పడుతూ ఉంటాయి. ఒకరినొకరు చంపుకుంటూ ఉంటారు. అనవసర రక్తపాతపు ఆట జరగాలి కదా. ఇక్కడ అందరూ వచ్చి కూర్చున్నప్పుడు ఈ విషయాలలో రమిస్తూ ఉండండి. శాంతిధామము, సుఖధామాలను స్మృతి చేస్తూ ఉండండి. మాకు ఏవేవి గుర్తుకు వస్తున్నాయి? అని మీ హృదయాన్ని మీరే ప్రశ్నించుకోండి. తండ్రి స్మృతి లేకుంటే బుద్ధి ఎక్కడో ఒకచోట భ్రమిస్తూ ఉందని అర్థమవుతుంది. వికర్మలు కూడా వినాశనమవ్వవు. పదవి కూడా తగ్గిపోతుంది. తండ్రి స్మృతి నిలువకపోతే, చక్రమును స్మరిస్తూ ఉన్నాసరే సంతోషము పెరుగుతుంది. కానీ శ్రీమతమును అనుసరించకపోతే, సేవ చేయకుంటే, బాప్ దాదా హృదయాన్ని కూడా అధిరోహించలేరు. సేవ చేయకుంటే, అనేకమందిని విసిగిస్తూ ఉంటారు. కొందరు మాత్రము చాలామందిని తమ సమానంగా తయారుచేసి తండ్రి వద్దకు తీసుకొని వస్తారు. వారిని చూసి బాబా చాలా సంతోషిస్తారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సదా హర్షితంగా ఉండేందుకు, బుద్ధిలో చదువు మరియు చదివించే తండ్రి గుర్తుండాలి. తింటూ, త్రాగుతూ అన్ని పనులు చేస్తూ చదువుపై పూర్తి శ్రద్ధ ఉండాలి.
2. బాప్ దాదా హృదయమును అధిరోహించేందుకు, శ్రీమతమును అనుసరించి చాలామందిని మీ సమానంగా తయారుచేసే సేవ చేయాలి. ఎవ్వరినీ విసిగించరాదు.