01-04-2020 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్దాదా" మధువనం
"మధురమైన పిల్లలూ - సుఖ-దుఃఖముల ఆట గురించి మీకు మాత్రమే తెలుసు. ఇందులో అర్ధకల్పము సుఖము, అర్ధకల్పము దుఃఖముంటుంది, తండ్రి దుఃఖమును హరించి సుఖమునిచ్చేందుకు వస్తారు"
ప్రశ్న:-
చాలామంది పిల్లలు ఏ విషయంలో తమ మహిమను తాము చేసుకుంటూ తమ హృదయాలను సంతోషపరచుకుంటారు?
జవాబు:-
చాలామంది, మేము సంపూర్ణమైపోయాము, సంపన్నమైపోయామని భావించి, తమ హృదయాలను సంతోషపరచుకుంటారు. ఇలా భావించడం కూడా తమ మహిమను తాము చేసుకోవడం. బాబా అంటున్నారు – మధురమైన పిల్లలూ! ఇప్పుడు మీరు ఇంకా చాలా పురుషార్థము చేయాలి. మీరు పావనంగా అయితే ప్రపంచము కూడా పావనమైనదిగా కావాలి. రాజధాని స్థాపనవ్వాలి. ఒక్కరే వెళ్లలేరు.
గీతము:-
తల్లివి నీవే, తండ్రివి నీవే... ( తుమ్ హీ హో మాతా, తుమ్ హీ పితా హో... )
ఓం శాంతి. ఇలా పిల్లలకు తమ పరిచయము లభిస్తుంది. మనమంతా ఆత్మలమే అని తండ్రి కూడా అంటున్నారు. అందరూ మనుష్యులే. చిన్నవారైనా, పెద్దవారైనా ప్రెసిడెంటు అయినా, రాజా-రాణి అయినా అందరూ మనుష్యులే. ఇప్పుడు తండ్రి అంటున్నారు - అందరూ ఆత్మలే కానీ నేను అత్మలందరి తండ్రిని. అందుకే నన్ను పరమపిత, పరమ ఆత్మ లేక సుప్రీమ్ అని అంటారు. వారు ఆత్మలైన మనందరికి తండ్రి అని, మనమంతా పరస్పరములో సోదరులమని పిల్లలకు తెలుసు. తర్వాత బ్రహ్మా ద్వారా సోదరీ-సోదరుల ఉన్నత కులము, నీచ కులము ఉంటాయి. ఆత్మలైతే అందరూ ఆత్మలే. ఇది కూడా మీకు తెలుసు. మనుష్యులకైతే ఏమీ తెలియదు. ఇప్పుడు తండ్రి కూర్చొని మీకు అర్థం చేయిస్తున్నారు. తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. ఓ భగవంతుడా! ఓ తల్లీ - తండ్రీ అని మనుష్యులు పాడుతూ ఉంటారు ఎందుకంటే ఉన్నతాతి ఉన్నతమైనవారు ఒక్కరే ఉండాలి కదా. వారు అందరికీ తండ్రి, అందరికీ సుఖమునిచ్చేవారు. ఈ సుఖ-దుఃఖముల ఆట గురించి కూడా మీకు తెలుసు. ఇప్పుడిప్పుడే సుఖము, ఇప్పుడిప్పుడే దుఃఖముంటుందని మనుష్యులు భావిస్తారు. అర్ధకల్పము సుఖము, అర్ధకల్పము దుఃఖముంటుందని వారికి తెలియదు. సతో ప్రధానము, సతో, రజో, తమో ఉన్నాయి కదా. శాంతిధామములో ఆత్మలు ఉన్నప్పుడు మనమంతా సత్యమైన బంగారంగా ఉండేవారము, అప్పుడు ఏ మాత్రము మలినము లేదు. భలే అక్కడ ఆత్మలలో తమ-తమ పాత్ర నిండి ఉంటుంది కానీ ఆత్మలన్నీ పవిత్రంగా ఉంటాయి. అపవిత్ర ఆత్మ అక్కడ ఉండదు. ఈ సమయంలో ఇక్కడ ఒక్క పవిత్రాత్మ కూడా లేదు. బ్రాహ్మణ కులభూషణులైన మీరు కూడా పవిత్రంగా అవుతూ ఉన్నారు. ఇప్పుడే మీరు స్వయాన్ని దేవతలమని చెప్పుకోలేరు. వారు సంపూర్ణ నిర్వికారులు. మిమ్ములను సంపూర్ణ నిర్వికారులని అనరు. దేవతలను తప్ప శంకరాచార్యులను గానీ, మరెవ్వరినీ గానీ అలా సంపూర్ణ నిర్వికారులని అనరు. జ్ఞానసాగరుని నోటి ద్వారా ఈ విషయాలను మీరే వింటున్నారు. జ్ఞానసాగరుడు ఒక్కసారి మాత్రమే వస్తారని కూడా మీకు తెలుసు. మానవులైతే పునర్జన్మలు తీసుకుని మళ్లీ వస్తారు. ఎవరైనా జ్ఞానము విని వెళ్ళిపోతే తమలో ఆ సంస్కారాలను నింపుకొని వెళ్లి ఉంటారు. కనుక వారు మళ్లీ జన్మ తీసుకుని వచ్చి వింటారు. 6-8 సంవత్సరాల వయసు గల పిల్లలలో కూడా కొంతమందికి బాగా అర్థం అయిపోతుంది ఎందుకంటే ఆత్మ అయితే అదే కదా. జ్ఞానము విన్నప్పుడు వారికి చాలా బాగుందని అనిపిస్తుంది. మాకు మళ్లీ అదే తండ్రి నుండి జ్ఞానము లభిస్తూ ఉందని ఆత్మ భావిస్తుంది. లోలోపల చాలా సంతోషం ఉంటుంది. ఇతరులకు కూడా నేర్పించడం ప్రారంభిస్తారు. చురుకైనవారిగా అయిపోతారు. ఉదాహరణకు యుద్ధాలు చేసేవారు కూడా తమతో ఆ సంస్కారాలు తీసుకెళ్తారు. కనుక వారు బాల్యము నుండే అదే పనిలో సంతోషంగా నిమగ్నమవుతారు. ఇప్పుడు మీరు పురుషార్థము చేసి నూతన ప్రపంచానికి యజమానులుగా అవ్వాలి. ఇప్పుడు మీరు అందరికీ - నూతన ప్రపంచానికి గాని, శాంతిధామానికి గాని మీరు యజమానులుగా అవ్వవచ్చు, శాంతిధామము మీ ఇల్లు, అక్కడ నుండి మీరు పాత్ర అభినయించేందుకు ఇక్కడకు వచ్చారు అని చెప్పండి. ఆత్మల గురించే తెలియనందుకు ఇది కూడా ఎవ్వరికీ తెలియదు. మనము నిరాకార ప్రపంచము నుండి ఇక్కడకు వచ్చామని మీకు కూడా ఇంతకుముందు తెలియదు. మనమంతా బిందువులము, భృకుటి మధ్య ఆత్మ నక్షత్రముంటుందని సన్యాసులు అంటారు. అయినా బుద్ధిలో పెద్ద రూపమే వచ్చేస్తుంది. సాలిగ్రామాలు అని అన్నందుకు పెద్ద రూపంగా భావిస్తారు. ఆత్మలు సాలిగ్రామాలు. యజ్ఞమును రచించేటప్పుడు అందుల్లో కూడా పెద్ద పెద్ద సాలిగ్రామాలను తయారుచేస్తారు. పూజ చేసేటప్పుడు సాలిగ్రామము యొక్క పెద్ద రూపమే బుద్ధిలో ఉంటుంది. ఇదంతా అజ్ఞానమని తండ్రి అంటున్నారు. జ్ఞానము వినిపించేది నేనొక్కరినే. నేను తప్ప ఈ ప్రపంచములో మరెవ్వరూ వినిపించలేరు. ఆత్మ ఒక బిందువని, అలాగే పరమాత్మ కూడా ఒక బిందువేనని ప్రపంచంలో ఎవ్వరూ అర్థం చేయించరు. వారు అఖండ జ్యోతి స్వరూప బ్రహ్మ అని అంటారు. బ్రహ్మ తత్వమును భగవంతుడని భావిస్తారు. మళ్లీ స్వయాన్ని కూడా భగవంతుడని చెప్పుకుంటారు. పాత్ర అభినయించేందుకు చిన్న ఆత్మ రూపములో భూమి పైకి వచ్చామని, మళ్లీ పెద్ద జ్యోతిలో లీనమవుతామని అంటారు. లీనమైతే తర్వాత ఏముంది! పాత్ర కూడా లీనమైపోతుంది. ఇది ఎంత తప్పు అవుతుంది.
ఇప్పుడు తండ్రి వచ్చి సెకెండులో జీవన్ముక్తినిస్తారు. మళ్లీ అర్ధకల్పము తర్వాత మెట్లు దిగుతూ జీవన బంధనములోకి వస్తారు. మళ్లీ తండ్రి వచ్చి జీవన్ముక్తులుగా చేస్తారు. అందుకే వారిని సర్వుల సద్గతిదాత అని అంటారు. పతితపావనుడైన తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. వారి స్మృతి ద్వారానే మీరు పావనంగా అవుతారు లేకుంటే పావనంగా అవ్వలేరు. అత్యంత ఉన్నతమైన వారు ఒక్క తండ్రి మాత్రమే. చాలామంది పిల్లలు మేము సంపూర్ణమైపోయామని భావిస్తారు. మేము పూర్తిగా తయారు అయిపోయాము అని తమ హృదయాన్ని సంతోషపరచుకుంటారు. దీనిని తమ మహిమను తామే చేసుకోవడము అని అంటారు. బాబా అంటున్నారు - మధురమైన పిల్లలూ! ఇంకా మీరు చాలా పురుషార్థము చేయాలి. పావనంగా అయితే మీ కొరకు ప్రపంచము కూడా పావనమైనది కావాలి. ఒక్కరే అయితే వెళ్లలేరు కదా. వేగంగా కర్మాతీతమవ్వాలని ఎవరు ఎంతగా ప్రయత్నించినా అవ్వలేరు. రాజధాని స్థాపనవ్వాలి. విద్యార్థి ఎంత తెలివిగలవాడైనా, పరీక్షలైతే వాటి సమయానికే జరుగుతాయి కదా. పరీక్షలు త్వరగా రమ్మంటే రావు. ఇది కూడా అలాగే జరుగుతుంది. సమయము వచ్చినప్పుడు మీ చదువు యొక్క రిజల్టు వెలువడుతుంది. ఎంత మంచి పురుషార్థులైనా మేము పూర్తిగా తయారయ్యామని చెప్పలేరు. 16 కళా సంపూర్ణులుగా ఇంతవరకు ఏ ఆత్మా తయారవ్వలేదు. అందుకు చాలా పురుషార్థము చేయాలి. మేము సంపూర్ణమైపోయామని మీ హృదయాలను సంతోషపరచుకోకండి. అలా అవ్వరు. సంపూర్ణమయ్యేది అంతిమములోనే. తమ మహిమను తామే చేసుకునేవారిగా అవ్వకండి. రాజధాని అంతా స్థాపనవ్వాలి. ఇక కొంత సమయము మాత్రమే ఉందని అర్థము చేసుకుంటారు, మిస్సైల్స్ కూడా తయారయ్యాయి. ఇవి తయారు చేసేందుకు కూడా మొదట సమయము పడుతుంది. తర్వాత అభ్యాసమైపోతుంది. కనుక వెంట వెంటనే తయారు చేస్తారు. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడే ఉంది. వినాశనము కొరకు బాంబులు తయారుచేస్తూ ఉంటారు. గీతలో కూడా మూసలము అనే పదముంది. శాస్త్రాలలో కడుపు నుండి ఇనుప మూసలము పుడుతుంది అని వ్రాశారు. ఇవన్నీ అసత్యపు మాటలు కదా. తండ్రి వచ్చి వాటినే మిస్సైల్సు అని అంటారని తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనము వినాశనానికి ముందే తమోప్రధానము నుండి సతోప్రధానంగా అవ్వాలి. మనము ఆదిసనాతన దేవీదేవతా ధర్మానికి చెందినవారమని పిల్లలకు తెలుసు. సత్యమైన బంగారంగా ఉండేవారము. భారతదేశాన్ని సత్య ఖండమని అంటారు. ఇప్పుడు అసత్య ఖండముగా తయారయింది. బంగారం కూడా సత్యంగా, అసత్యంగా ఉంటుంది కదా. ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి మహిమ ఏమిటో తెలుసుకున్నారు. వారు మానవ సృష్టికి బీజరూపులు, సత్యమైనవారు, చైతన్యమైనవారు. ఇంతకుముందు కేవలం మహిమ చేసేవారు. ఆ తండ్రి ఇప్పుడు మనలో అన్ని గుణాలు నింపుతున్నారని మీకు తెలుసు. తండ్రి అంటున్నారు - మొట్టమొదట స్మృతియాత్ర చేయండి, నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమైపోతాయి. నా పేరే పతితపావనుడు. ఓ పతితపావనా! రండి అని పాట కూడా పాడతారు, కానీ వారు వచ్చి ఏం చేస్తారో ఎవ్వరికీ తెలియదు. ఒకే సీత ఉండరు కదా, మీరంతా సీతలే.
తండ్రి పిల్లలైన మిమ్ములను అనంతములోకి తీసుకెళ్లేందుకు అనంతమైన విషయాలు వినిపిస్తారు. అనంతమైన బుద్ధి ద్వారా స్త్రీ-పురుషులంతా సీతలే అని మీకు తెలుసు. అందరూ రావణుని జైలులో ఉన్నారు. తండ్రి (రాముడు) వచ్చి అందరినీ రావణుని జైలు నుండి విడిపిస్తారు. రావణుడు మనిషి కాదు. ప్రతి ఒక్కరిలో 5 వికారాలున్నాయి. అందుకే దీనిని రావణ రాజ్యమంటారు. దీని పేరే వికారీ ప్రపంచము, అది నిర్వికారి ప్రపంచము. రెండిటికీ వేరు వేరు పేర్లు ఉన్నాయి. ఇది వేశ్యాలయము, అది శివాలయము. నిర్వికార ప్రపంచానికి ఈ లక్ష్మీనారాయణులు యజమానులుగా ఉండేవారు. వీరి ముందు వికారి మనుష్యులు తల వంచి నమస్కరిస్తారు. వికారి రాజులు, ఆ నిర్వికారి రాజుల ముందు తల వంచి నమస్కరిస్తారు. ఇది కూడా మీకు తెలుసు. మనుష్యులకు కల్పము ఆయువెంతో కూడా తెలియదు. కనుక రావణ రాజ్యమెప్పుడు ప్రారంభమవుతుందో ఎలా తెలుస్తుంది? సగము-సగము ఉండాలి కదా. రామరాజ్యము, రావణ రాజ్యము ఎప్పటి నుండి ప్రారంభమవుతాయి? అంతా తికమక చేసేశారు.
ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ 5 వేల సంవత్సరాల చక్రము తిరుగుతూనే ఉంటుంది. మనము 84 జన్మల పాత్ర అభినయిస్తామని ఇప్పుడు మీకు తెలిసింది. తర్వాత మనము ఇంటికి వెళ్ళిపోతాము. సత్య-త్రేతా యుగాలలో కూడా పునర్జన్మలు తీసుకుంటారు. అది రామరాజ్యము. ఆ తర్వాత రావణ రాజ్యములోకి రావాల్సి ఉంటుంది. ఇది గెలుపు-ఓటముల ఆట. మీరు గెలుపొందితే స్వర్గానికి యజమానులుగా అవుతారు, ఓడిపోతే నరకానికి యజమానులుగా అవుతారు. స్వర్గము వేరుగా ఉంటుంది. ఎవరైనా మరణిస్తే, స్వర్గస్థులయ్యారని అంటారు. మీరిప్పుడలా అనరు. ఎందుకంటే స్వర్గం ఎప్పుడు ఉంటుందో మీకు తెలుసు. వారేమో జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందని అంటారు లేక నిర్వాణానికి వెళ్ళారని అంటారు. కానీ అలా జ్యోతి జ్యోతిలో కలిసిపోదని మీరంటారు. సర్వుల సద్గతిదాత ఒక్కరే అని గాయనముంది. సత్యయుగమును స్వర్గమని అంటారు. ఇప్పుడిది నరకము. ఇది భారదేశపు మాటే. అంతేకానీ పైన ఏ స్వర్గమూ లేదు. దిల్ వాడా మందిరములో పైన స్వర్గమును చూపించారు. అందువలన స్వర్గము పైనే ఉంటుందని మనుష్యులు భావిస్తారు. అరే, పైన పైకప్పులో మనుష్యులు ఎలా నివసించగలరు, బుద్ధిహీనులు అయినట్లు కదా. ఇప్పుడు మీరు వాటన్నిటినీ స్పష్టంగా అర్థము చేయిస్తారు. ఇక్కడే స్వర్గవాసులుండేవారని, వారే తిరిగి ఇక్కడే నరకవాసులుగా అవుతారని మీకు తెలుసు. ఇప్పుడు మళ్లీ స్వర్గవాసులుగా అవ్వాలి. ఈ జ్ఞానము నరుని నుండి నారాయణునిగా చేస్తుంది. సత్యనారాయణునిగా తయారయ్యే కథను కూడా వినిపిస్తారు. సీతారాముల కథ కాదు. ఇది నరుని నుండి నారాయణునిగా అయ్యే కథ. లక్ష్మీనారాయణుల పదవి సర్వ శ్రేష్ఠమైనది. సీతా-రాములలో రెండు కళలు తగ్గిపోతాయి. శ్రేష్ఠ పదవిని పొందేందుకే పురుషార్థము చేయబడుతుంది. ఒకవేళ పురుషార్థము చేయకపోతే వెళ్ళి చంద్రవంశస్థులైపోతారు. భారతవాసులు పతితులవ్వగానే తమ ధర్మమునే మర్చిపోతారు. క్రైస్తవులు సతో నుండి తమోప్రధానులుగా అయినా తమ సంప్రదాయములోనే ఉన్నారు కదా. ఆది సనాతన దేవీదేవతా ధర్మము వారు తమను తాము హిందువులని చెప్పుకుంటున్నారు. మేము వాస్తవానికి దేవీదేవతా వంశమువారిమని అర్థము చేసుకోరు. విచిత్రము కదా. హిందూ ధర్మమును ఎవరు స్థాపించారు? అని మీరు అడిగితే తికమకపడతారు. దేవతల పూజ చేస్తున్నారంటే దేవతా ధర్మమువారని అర్థము కదా, కానీ అర్థము చేసుకోరు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. మీ బుద్ధిలో పూర్తి జ్ఞానమంతా ఉంది. మనము మొదట సూర్యవంశములో ఉండేవారము, తర్వాత ఇతర ధర్మములన్నీ వస్తాయి. మనము పునర్జన్మలు తీసుకుంటూ వస్తాము. మీలో కూడా ఎవరో కొంతమందే యథార్థంగా అర్థము చేసుకుంటారు. పాఠశాలలో కూడా కొందరి బుద్ధిలో బాగా కూర్చుంటుంది. కొందరి బుద్ధిలో తక్కువగా కూర్చుంటుంది. ఇక్కడ కూడా పాస్ అవ్వని వారిని క్షత్రియులని అంటారు. చంద్రవంశములోకి వెళ్ళిపోతారు. రెండు కళలు తగ్గిపోతాయి కదా. సంపూర్ణులుగా అవ్వలేరు. మీ బుద్ధిలో ఇప్పుడు అనంతమైన చరిత్ర-భూగోళాలు ఉన్నాయి. ఆ పాఠశాలలో హద్దులోని చరిత్ర-భూగోళాలు చదువుతారు. వారికి మూలవతనము, సూక్ష్మవతనమంటే ఏమిటో తెలియదు. సాధుసన్యాసులు మొదలైనవారి బుద్ధిలో కూడా లేదు. మూలవతనములో ఆత్మలుంటాయని మీ బుద్ధిలో ఉంది. ఇది స్థూలవతనము. మీ బుద్ధిలో జ్ఞానమంతా ఉంది. స్వదర్శన చక్రధారి సైన్యము కూర్చుని ఉంది. ఈ సైన్యము తండ్రిని, చక్రమును స్మృతి చేస్తుంది. మీ బుద్ధిలో జ్ఞానముంది. అంతేకాని ఆయుధాలు మొదలైనవేవీ లేవు. జ్ఞానము ద్వారా స్వ దర్శనము జరిగింది. తండ్రి రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల జ్ఞానమును ఇస్తారు. ఇప్పుడు తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు - రచయితను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. ఎవరు ఎంత స్వదర్శన చక్రధారులుగా తయారైతే అంత ఇతరులను తయారుచేస్తారు. ఎవరు ఎక్కువ సర్వీసు చేస్తారో వారికి అంత ఎక్కువ పదవి లభిస్తుంది. ఇది సాధారణ విషయము. గీతలో కృష్ణుని పేరు వేయడము వలన తండ్రిని మర్చిపోయారు. కృష్ణుడిని భగవంతుడని అనరాదు. వారిని తండ్రి అని అనలేరు. వారసత్వము తండ్రి ద్వారా లభిస్తుంది. పతితపావనులని తండ్రికి చెప్పబడుతుంది. వారు వచ్చినప్పుడు మనము తిరిగి శాంతిధామానికి వెళ్తాము. మనుష్యులు ముక్తి కొరకు ఎంత తల కొట్టుకుంటూ ఉంటారు. మీరు ఎంత సహజముగా తెలియజేస్తారు! పతితపావనులు పరమాత్మ, మరి గంగలో స్నానము చేసేందుకు ఎందుకు వెళ్తారు! గంగానది తీరముకు వెళ్లి కూర్చుని అక్కడే మరణించాలని ఆశిస్తారు. ఇదివరకు బెంగాలులో ఎవరైనా మరణించేటప్పుడు గంగా నదికి వెళ్ళి "హరి అని పలుకు" అని అనేవారు. అలా చేస్తే ముక్తులైపోతారని భావిస్తారు. ఇప్పుడు ఆత్మ అయితే వెళ్ళిపోయింది. అదైతే పవిత్రంగా అవ్వలేదు. ఆత్మను పవిత్రంగా చేసేవారు తండ్రి ఒక్కరు మాత్రమే. వారినే పిలుస్తారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - నన్ను స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. తండ్రి వచ్చి పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచంగా చేస్తారు. అంతేకాని కొత్త దానిని రచించరు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రిలో ఏ గుణాలున్నాయో వాటిని స్వయంలో నింపుకోవాలి. పరీక్షకు ముందే పురుషార్థము చేసి స్వయాన్ని సంపూర్ణ పావనంగా చేసుకోవాలి. ఇందులో తమ మహిమను తామే చేసుకునేవారిగా అవ్వకూడదు.
2. స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి, ఇతరులను కూడా తయారుచేయాలి. తండ్రిని, చక్రమును స్మృతి చేయాలి. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన విషయాలను విని తమ బుద్ధిని అనంతంలో ఉంచాలి. హద్దులోకి రాకూడదు.
వరదానము:-
మధురమైన సైలెన్సులో లవలీనంగా ఉండే స్థితి ద్వారా నష్టోమోహా సమర్థ స్వరూప భవ
దేహము, దేహ సంబంధాలు, దేహ సంస్కారాలు, వ్యక్తి లేక వైభవాలు, వాయుమండలం, వైబ్రేషన్లు అన్నీ ఉన్నా, అవి తమ వైపుకు ఆకర్షించరాదు. మనుష్యులు ఆర్తనాదాలు చేస్తున్నా, మీరు అచలంగా ఉండండి. ప్రకృతి, మాయ అన్నీ చివరి ఆట ఆడి, మిమ్మల్ని తమవైపుకు ఎంతగా ఆకర్షించినా మీరు అతీతంగా, తండ్రికి ప్రియంగా అయ్యే స్థితిలో లవలీనంగా ఉండండి - దీనినే చూస్తున్నా చూడకుండా ఉండడం, వింటున్నా వినకుండా ఉండడం అని అంటారు. ఇదే స్వీట్ సైలెన్స్ స్వరూపంలో లవలీనమై ఉండే స్థితి. ఎప్పుడైతే ఇటువంటి స్థితి తయారవుతుందో అప్పుడు నష్టోమోహా సమర్థ స్వరూపంలోని వరదాని ఆత్మ అని అంటారు.
స్లోగన్:-
హోలీహంసగా అయి అవగుణాలనే కంకర రాళ్లను వదిలి మంచి అనే ముత్యాలనే ఏరుతూ ఉండండి.