ఓంశాంతి. పాడైపోయినవారిని బాగుచేసేవారు ఒక్క తండ్రియే అని పిల్లలు ఇప్పుడు అర్థం చేసుకున్నారు. భక్తి మార్గములో అనేక మంది దగ్గరకు వెళ్తారు. ఎన్నో తీర్థయాత్రలు మొదలైనవి చేస్తారు. పాడైపోయిన వారిని బాగుచేసేవారు, పతితులను పావనంగా చేసేవారు ఒక్కరే, సద్గతిదాత, గైడ్ (మార్గదర్శకుడు), లిబరేటర్ (ముక్తిదాత) కూడా వారొక్కరే. ఇప్పుడు గాయనమైతే ఉంది కాని అనేక మంది మనుష్యులు, అనేక ధర్మాలు, మఠాలు, మార్గాలు, శాస్త్రాలు ఉండడం వలన అనేక మార్గాలను వెతుకుతూ ఉంటారు. సుఖ-శాంతుల కొరకు సత్సంగాలకు వెళ్తారు కదా. ఎవరైతే వెళ్ళరో, వారు మాయావి నషాలోనే ఆనందంగా ఉంటారు. ఇప్పుడిది కలియుగ అంతిమమని పిల్లలైన మీకు తెలుసు. సత్యయుగము ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు ఏముంది? ఇది మనుష్యులకు తెలియదు. కొత్త ప్రపంచములో సుఖము, పాత ప్రపంచములో తప్పకుండా దుఃఖము ఉంటుందని చిన్న బాలునికి కూడా అర్థము అవుతుంది. ఈ పాత ప్రపంచములో అనేక మంది మనుష్యులు, అనేక ధర్మాలున్నాయి. మీరు ఎవ్వరికైనా అర్థం చేయించవచ్చు. ఇది కలియుగము, సత్యయుగము గడిచిపోయింది. అక్కడ ఒకే ఒక్క ఆది సనాతన దేవి దేవతా ధర్మముండేది, ఇక ఏ ఇతర ధర్మమూ లేదు. బాబా చాలా సార్లు అర్థం చేయించారు, మళ్ళీ అర్థం చేయిస్తూనే ఉన్నారు, ఇప్పుడు వచ్చేవారికి కొత్త ప్రపంచము మరియు పాత ప్రపంచం యొక్క వ్యత్యాసాన్ని చూపించాలి. భలే వారు ఏం అన్నా, కొంతమంది దీని ఆయువు 10 వేల సంవత్సరాలని, కొంత మంది 30 వేల సంవత్సరాలని అంటారు. అనేక మతాలున్నాయి కదా. ఇప్పుడు వారి దగ్గర ఉండేది శాస్త్రాల మతము. అనేక శాస్త్రాలు, అనేక మతాలు. మనుష్యుల మతాలు కదా. శాస్త్రాలు వ్రాసేది కూడా మనుష్యులే కదా. దేవతలు ఏ శాస్త్రాలనూ వ్రాయరు. సత్యయుగములో దేవీ దేవతా ధర్మముంటుంది. వారిని మనుష్యులని కూడా అనలేరు. కనుక ఎవరైనా మిత్రులు, బంధువులు కలిసినప్పుడు వారిని కూర్చోబెట్టి ఇవి వినిపించాలి. ఇవి ఆలోచించే విషయాలు. కొత్త ప్రపంచములో ఎంత తక్కువ మంది మనుష్యులు ఉంటారు. పాత ప్రపంచములో జనాభా ఎంత వృద్ధి చెందుతుంది! సత్యయుగములో కేవలం దేవతా ధర్మము ఒక్కటే ఉండేది. మనుష్యులు కూడా కొద్ది మంది మాత్రమే ఉండేవారు. దైవీగుణాలు దేవతలలోనే ఉంటాయి, మనుష్యులలో ఉండవు. అందుకే మనుష్యులు వెళ్ళి దేవతలకు నమస్కరిస్తారు కదా, దేవతల మహిమను గాయనము చేస్తారు. వారు స్వర్గవాసులని, మేము నరకవాసులము, కలియుగ వాసులమని వారికి తెలుసు. మనుష్యులలో దైవీగుణాలుండవు. ఫలానా వ్యక్తిలో చాలా మంచి దైవీ గుణాలున్నాయి అని ఎవరైనా చెప్తే, వారిలో దైవీగుణాలు లేవు, దైవీ గుణాలు దేవతలలోనే ఉంటాయి, ఎందుకంటే వారు పవిత్రంగా ఉంటారని వారికి చెప్పండి. ఇక్కడ పవిత్రంగా లేని కారణంగా ఎవరిలోనూ దైవీగుణాలు ఉండవు ఎందుకంటే ఇది ఆసురీ రావణ రాజ్యము కదా. కొత్త వృక్షములో దైవీగుణాలు గల దేవతలుంటారు, తర్వాత మళ్ళీ వృక్షము పాతదైపోతుంది. రావణ రాజ్యములో దైవీ గుణాలు కలవారు ఉండడం జరగదు. సత్యయుగములో ఆది సనాతన దేవిదేవతా ధర్మము వారి ప్రవృత్తి మార్గముండేది. ప్రవృత్తి మార్గము వారి మహిమనే గాయనము చేయబడింది. సత్యయుగములో మనము పవిత్ర దేవీ దేవతలుగా ఉండేవారము, సన్యాస మార్గము లేదు. మీకు ఎన్నో పాయింట్లు లభిస్తాయి. కాని అన్ని పాయింట్లు ఎవరి బుద్ధిలోనూ ఉండవు. పాయింట్లు మర్చిపోతారు కనుక ఫెయిల్ అవుతారు. దైవీగుణాలను ధారణ చేయరు. ఒక్క దైవీగుణమే మంచిది - ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడకూడదు, మధురంగా మాట్లాడాలి, చాలా తక్కువగా మాట్లాడాలి, ఎందుకంటే పిల్లలైన మీరు టాకీ నుండి మూవీలోకి, మూవీ నుండి సైలెన్స్ లోకి వెళ్ళాలి. కనుక టాకీని చాలా తగ్గించాలి. చాలా కొద్దిగా, నెమ్మదిగా మాట్లాడితే, వారు రాయల్ కుటుంబానికి చెందినవారని భావిస్తారు. నోటి నుండి సదా రత్నాలే వెలువడాలి.
సన్యాసులు లేక ఇంకెవరైనా వస్తే వారికి కొత్త మరియు పాత ప్రపంచం యొక్క తేడాను చెప్పాలి. సత్యయుగములో దైవీగుణాల దేవతలు ఉండేవారు, వారిది ప్రవృత్తి మార్గము. సన్యాసులైన మీ ధర్మమే వేరు. అయినా నూతన సృష్టి సతోప్రధానంగా ఉంటుందని, ఇప్పుడు తమోప్రధానంగా ఉందని మీరు అర్థం చేసుకున్నారు కదా. ఆత్మ తమోప్రధానమైనందుకు శరీరము కూడా తమోప్రధానమైనదే లభిస్తుంది. ఇప్పుడిది పతిత ప్రపంచము. అందరినీ పతితులనే అంటారు. అది పావన సతోప్రధానమైన ప్రపంచము. ఆ నూతన ప్రపంచమే ఇప్పుడు పాతదైపోయింది. ఈ సమయములోని మనుష్యాత్మలందరూ నాస్తికులుగా ఉన్నారు, అందుకే గొడవలు అవుతున్నాయి. ప్రభు-స్వామిని తెలుసుకోలేనందున పరస్పరము కొట్లాడుకుంటూ, గొడవపడుతూ ఉంటారు. రచయిత, రచనల గురించి తెలిసిన వారిని ఆస్తికులని అంటారు. సన్యాస ధర్మము వారికి నూతన ప్రపంచము గురించి తెలియనే తెలియదు. కనుక వారు ఆ ప్రపంచములోకి రానే రారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు ఆత్మలన్నీ తమోప్రధానమైపోయాయి, మళ్ళీ ఆత్మలను సతోప్రధానంగా ఎవరు చేస్తారు? అది తండ్రి ఒక్కరు మాత్రమే చేయగలరు. సతోప్రధాన ప్రపంచములో మనుష్యులు కొంతమందే ఉంటారు. మిగిలినవారంతా ముక్తిధామంలో ఉంటారు. బ్రహ్మతత్వము, ఆత్మలమైన మనము నివసించే స్థానము. దానిని బ్రహ్మాండమని అంటారు. ఆత్మ అయితే అవినాశి. ఇది అవినాశి నాటకము, ఇందులో ఆత్మలందరి పాత్ర ఉంది. నాటకము ఎప్పుడు ప్రారంభమయ్యింది? అది ఎప్పుడూ ఎవ్వరూ చెప్పలేరు. ఇది అనాది డ్రామా కదా. తండ్రి కేవలం పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేసేందుకు రావలసి వస్తుంది. అంతేగానీ తండ్రి నూతన సృష్టిని రచిస్తారని కాదు. పతితులైనప్పుడే వారిని పిలుస్తారు, సత్యయుగములో ఎవ్వరూ పిలువరు. అది ఉన్నదే పావన ప్రపంచము. రావణుడు పతితంగా చేస్తారు, పరమపిత పరమాత్మ వచ్చి పావనంగా చేస్తారు. తప్పకుండా ఇది సగము, అది సగము అని అంటారు. బ్రహ్మా పగలు మరియు బ్రహ్మా రాత్రి సగం-సగం ఉంటాయి. జ్ఞానముతో పగలుగా అవుతుంది, అక్కడ అజ్ఞానముండదు. భక్తిమార్గమును చీకటి మార్గమని అంటారు. దేవతలు పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మళ్ళీ అంధకారములోకి వస్తారు. కనుక ఈ మెట్ల చిత్రములో - మనుష్యులు సతో, రజో, తమోలోకి ఎలా వస్తారో చూపించారు. ఇప్పుడు అందరిదీ శిథిలావస్థ. తండ్రి బదిలీ చేసేందుకు అనగా మనుష్యులను దేవతలుగా చేసేందుకు వస్తారు. దేవతలున్నప్పుడు ఆసురీ గుణాలు కల మనుష్యులు లేరు. ఇప్పుడీ ఆసురీ గుణాల వారిని మళ్ళీ దైవీగుణాలు కలవారిగా ఎవరు చేస్తారు? ఇప్పుడు అనేక ధర్మాలు, అనేక మంది మనుష్యులు ఉన్నారు. అందరూ కొట్లాడుకుంటూ, గోడవపడుతూ ఉంటారు. సత్యయుగములో ఒకే ధర్మముంటుంది కనుక దుఃఖం యొక్క విషయమే ఉండదు. శాస్త్రాలలో అయితే చాలా కల్పిత కథలు ఉన్నాయి, వాటిని జన్మ జన్మాంతరాలుగా చదువుతూ వచ్చారు. ఇవన్నీ భక్తి మార్గములోని శాస్త్రాలు, వాటి ద్వారా నన్ను మీరు పొందలేరని తండ్రి చెప్తున్నారు. నేను స్వయంగా ఒక్కసారి మాత్రమే వచ్చి అందరికీ సద్గతినివ్వాల్సి వస్తుంది. ఇలాగే ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. చాలా ఓపికగా కూర్చొని అర్థం చేయించాలి, గొడవలు ఉండకూడదు. వారికి తమ అహంకారము ఉంటుంది కదా. సాధు సత్పురుషులతో వారి శిష్యులు కూడా ఉంటారు. వారు వెంటనే వీరికి కూడా బ్రహ్మాకుమారీల ఇంద్రజాలము తగిలిందని అంటారు. తెలివైనవారు ఇవి ఆలోచించదగిన విషయాలని అంటారు. మేళాలకు, ప్రదర్శినీలకు అనేక రకాలైన మనుష్యులు వస్తారు కదా. ప్రదర్శినీలు మొదలైన వాటికి ఎవరైనా వస్తే వారికి చాలా ఓపికగా అర్థం చేయించాలి, బాబా ఎలాగైతే ఓపికగా అర్థం చేయిస్తున్నారో అలా అర్థం చేయించాలి. చాలా గట్టిగా మాట్లాడకూడదు. ప్రదర్శినీలలో అయితే చాలా మంది చేరుతారు కదా. మీరు కొంత సమయము తీసి ఏకాంతంగా వచ్చి అర్థం చేసుకుంటే మీకు రచయిత-రచనల రహస్యము చెప్తాము, అని చెప్పండి. రచన ఆది మధ్యాంతాల జ్ఞానము రచయిత అయిన తండ్రే అర్థం చేయిస్తారు. మిగిలినవారంతా తెలియదు-తెలియదు అని అంటూ వెళ్ళిపోతారు. మనుష్యులెవ్వరూ వెళ్ళలేరు. జ్ఞానము ద్వారా సద్గతి అవుతుంది, తర్వాత జ్ఞానము అవసరముండదు. ఈ జ్ఞానము తండ్రి తప్ప ఇతరులెవ్వరూ అర్థం చేయించలేరు. అర్థం చేయించేవారు ఎవరైనా వృద్ధులైతే, వీరు అనుభవజ్ఞులు, సత్సంగాలు మొదలైనవాటికి వెళ్ళి ఉంటారని మనుష్యులు భావిస్తారు. ఎవరైనా చిన్న పిల్లలు అర్థం చేయిస్తే వీరికి ఏం తెలుసు అని అంటారు. కనుక అటువంటి వారిపై వృద్ధుల ప్రభావము పడవచ్చు. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి ఈ జ్ఞానము అర్థం చేయిస్తారు. తమోప్రధానము నుండి సతోప్రధానంగా చేస్తారు. మాతలు కూర్చొని వారికి అర్థం చేయిస్తే సంతోషిస్తారు. జ్ఞానసాగరుడైన తండ్రి జ్ఞాన కలశాన్ని మాతలైన మాకు ఇచ్చారు, దానిని మేము ఇతరులకు ఇస్తున్నామని చెప్పండి. చాలా నమ్రతగా చెప్తూ ఉండాలి. మాకు వినిపించేది జ్ఞానసాగరుడైన శివుడే. నేను మాతల ద్వారా ముక్తి-జీవన్ముక్తుల ద్వారాలను తెరుస్తానని వారు చెప్తున్నారు. ఇతరులెవ్వరూ తెరవలేరు. మేము ఇప్పుడు పరమాత్ముని ద్వారా చదువుకుంటున్నాము. మమ్మల్ని చదివించేది ఏ మనుష్యులూ కాదు. జ్ఞానసాగరులు ఒక్క పరమపిత పరమాత్మయే. మీరందరూ భక్తి సాగరులు. మీరు భక్తికి అథారిటి కలవారు, జ్ఞానానికి కాదు. నేను ఒక్కరినే జ్ఞానానికి అథారిటీని. మహిమ కూడా ఒక్కరికే చేస్తారు. వారే ఉన్నతాతి ఉన్నతమైనవారు. మేము వారినే నమ్ముతాము. వారు వచ్చి బ్రహ్మా తనువు ద్వారా చదివిస్తున్నారు. అందుకే బ్రహ్మాకుమార-కుమారీలని గాయనము చేయబడింది. ఈ విధంగా చాలా మధురంగా కూర్చొని అర్థం చేయించండి. భలే ఎంత చదువుకున్నవారైనా, చాలా ప్రశ్నలు వేస్తారు. మొట్టమొదట తండ్రిపై నిశ్చయము కలిగించాలి. మొట్టమొదట, రచయిత తండ్రినా కాదా, అని తెలుసుకోండి. అందరి రచయిత ఒక్క శివబాబాయే, వారే జ్ఞానసాగరులు. తండ్రి, టీచరు, సద్గురువు. రచయిత అయిన తండ్రినే స్వయంగా రచన యొక్క ఆది-మధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తున్నారని మొదట నిశ్చయబుద్ధితో ఉండాలి. వారే మనకు అర్థం చేయిస్తున్నారు, వారు తప్పకుండా రైటే వినిపిస్తారు. అప్పుడు ఏ ప్రశ్నలు ఉత్పన్నమవ్వవు. తండ్రి సంగమయుగములోనే వస్తారు. కేవలం నన్ను స్మృతి చేస్తే పాపాలు భస్మమవుతాయని చెప్తారు. పతితులను పావనంగా చేయడమే మన కర్తవ్యము. ఇప్పుడిది తమోప్రధాన ప్రపంచము. పతిత పావనుడైన తండ్రి లేకుండా ఎవ్వరికీ జీవన్ముక్తి లభించదు. అందరూ గంగా స్నానము చేసేందుకు వెళ్తున్నారంటే పతితులుగా ఉన్నట్లే కదా. నేను గంగా స్నానము చేయమని చెప్పను. నన్ను ఒక్కరినే నిరంతరం స్మృతి చేయండి అని చెప్తాను. నేను ప్రేయసులైన మీ అందరికీ ప్రియుడిని. అందరూ ఒక్క ప్రియుడినే స్మృతి చేస్తారు. రచనను రచించినవారు ఒక్క తండ్రి మాత్రమే. దేహీ అభిమానులుగా అయి నన్ను స్మృతి చేస్తే, ఈ యోగాగ్ని ద్వారా వికర్మలన్నీ వినాశనమవుతాయని వారు చెప్తున్నారు. పాత ప్రపంచము పరివర్తన అవుతున్నప్పుడే తండ్రి వచ్చి ఈ యోగమును నేర్పిస్తారు. వినాశము ఎదురుగా ఉంది. ఇప్పుడు మనము దేవతలుగా అవుతున్నాము. తండ్రి ఎంతో సులభంగా చెప్తున్నారు. మీరు తండ్రి ముందు కూర్చొని వింటున్నారు. కాని ఏకరసంగా అయ్యి వినరు. బుద్ధి ఇతర వైపులకు పరుగెత్తుతూ ఉంటుంది. భక్తిలో కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. రోజంతా వృథా అవుతుంది, ఇక మిగతా ఫిక్స్ చేసుకున్న సమయములో కూడా బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది. అందరికీ ఇటువంటి పరిస్థితినే ఉండి ఉంటుంది. మాయ ఉంది కదా!
కొంతమంది పిల్లలు తండ్రి ముందు కూర్చొని ధ్యానములోకి వెళ్ళిపోతారు. ఇది కూడా సమయము వ్యర్థమవ్వడమే కదా. సంపాదన ఏమీ జరగడం లేదు. స్మృతిలో ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయని తండ్రి చెప్తున్నారు. ధ్యానములోకి వెళ్ళినట్లయితే బుద్ధిలో తండ్రి స్మృతి ఉండదు. ఈ విషయాలన్నిటిలో చాలా తికమక ఉంది. మీరు కళ్ళు కూడా మూసుకోకూడదు. స్మృతిలో కూర్చోవాలి కదా. కళ్ళు తెరచుకునేందుకు భయపడకూడదు. కళ్ళు తెరుచుకునే ఉండాలి. బుద్ధిలో ప్రియుని స్మృతియే ఉండాలి. కళ్ళు మూసుకొని కూర్చోవడం, ఇది నియమము కాదు. తండ్రి చెప్తున్నారు, స్మృతిలో కూర్చోండి. కళ్ళు మూసుకొని కూర్చోమని అయితే చెప్పడం లేదు. కళ్ళు మూసుకొని తల వంచుకొని కూర్చుంటే బాబా ఎలా చూస్తారు? కళ్ళు ఎప్పుడూ మూసుకోకూడదు. కళ్ళు మూసుకున్నట్లయితే ఏదో ఒక లోపము ఉంటుంది, ఇతరులెవరినో స్మృతి చేస్తూ ఉంటారు. తండ్రి చెప్తున్నారు, ఎవరైనా మిత్రులను, బంధువులను స్మృతి చేస్తే మీరు సత్యమైన ప్రేయసులు కాదు. సత్యమైన ప్రేయసులుగా అయినప్పుడే ఉన్నత పదవిని పొందుతారు. కష్టమంతా స్మృతి చేయడంలోనే ఉంది. దేహాభిమానములో తండ్రిని మర్చిపోతారు, తరువాత ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు, చాలా మధురంగా కూడా అవ్వాలి. వాతావరణము కూడా మధురంగా ఉండాలి, ఎటువంటి శబ్దమూ చేయకూడదు. ఎవరైనా వచ్చి చూస్తే ఎంత మధురంగా మాట్లాడుతున్నారని అనిపించాలి. చాలా నిశ్శబ్దంగా ఉండాలి. ఎటువంటి గోడవలు-కొట్లాటలు ఉండకూడదు. లేకపోతే తండ్రి, టీచరు, గురువును నిందింపజేసిన వారవుతారు. వారు పదవి కూడా చాలా తక్కువది పొందుతారు. పిల్లలకు ఇప్పుడు తెలివి లభించింది. తండ్రి చెప్తున్నారు, ఉన్నత పదవిని పొందేందుకు నేను మిమ్మల్ని చదివిస్తున్నాను. మీరు చదివి ఇతరులను చదివించాలి. ఎవ్వరికీ వినిపించకపోతే ఏ పదవిని పొందుతాము అని స్వయం కూడా తెలుసుకోగలరు. ప్రజలను తయారుచేసుకోకపోతే ఏమవుతారు! యోగము లేదు, జ్ఞానము లేదు అంటే తప్పకుండా చదువుకున్న వారి ముందు తల వంచవలసి వస్తుంది. స్వయాన్ని చూసుకోవాలి - ఈ సమయంలో ఉత్తీర్ణులు అవ్వకుండా, తక్కువ పదవి పొందుతూ ఉంటే కల్ప-కల్పాంతరము తక్కువ పదవే పొందుతూ ఉంటారు. తండ్రి కర్తవ్యము అర్థం చేయించడం, అర్థం చేసుకోకపోతే తమ పదవిని భ్రష్టం చేసుకుంటారు. ఎవరెవరికి ఎలా అర్థం చేయించాలో - అది కూడా బాబా అర్థం చేయిస్తూ ఉంటారు. ఎంత కొద్దిగా, ఎంత నెమ్మదిగా చెప్తే అంత మంచిది. సేవ చేసేవారి యొక్క మహిమ బాబా కూడా చేస్తారు కదా. చాలా మంచి సేవ చేస్తే బాబా హృదయమును అధిరోహిస్తారు. సేవ ద్వారా మాత్రమే హృదయాన్ని అధిరోహిస్తారు కదా. స్మృతి యాత్ర కూడా తప్పకుండా చేయాలి, అప్పుడే సతోప్రధానంగా అవుతారు. శిక్షలు ఎక్కువగా అనుభవిస్తే పదవి తగ్గిపోతుంది. పాపాలు భస్మము అవ్వకపోతే శిక్షలు చాలా అనుభవించవలసి ఉంటుంది, పదవి కూడా తగ్గిపోతుంది. దానిని నష్టపోవడమని అంటారు. ఇది కూడా వ్యాపారమే కదా. నష్టపోకూడదు. దైవీగుణాలను ధారణ చేయండి. ఉన్నతంగా అవ్వాలి. ఉన్నతి చెందేందుకు బాబా రకరకాల విషయాలు వినిపిస్తారు, ఇప్పుడెవరు చేస్తే వారే పొందుతారు. మీరు దేవతల ప్రపంచంలో ఉండేవారిగా అవ్వాలంటే, గుణాలు కూడా అటువంటివి ధారణ చేయాలి. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఎవరితోనైనా చాలా నమ్రతతో, నెమ్మదిగా మాట్లాడాలి. మాట-నడవడిక చాలా మధురంగా ఉండాలి. నిశ్శబ్దమైన వాతావరణముండాలి. ఎటువంటి శబ్దాలు లేనప్పుడు సర్వీసు యొక్క సఫలత జరుగుతుంది.
2. సత్యాతి-సత్యమైన ప్రేయసులుగా అయి ఒక్క ప్రియుడిని స్మృతి చేయాలి. స్మృతిలో ఎప్పుడూ కళ్ళు మూసుకొని, తల వంచుకొని కూర్చోకూడదు, దేహీ అభిమానులుగా అయి ఉండాలి.