ఓంశాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తెలుసు, మళ్ళీ అనగా కల్ప-కల్పము తర్వాత. దీనినే దూరదేశములో ఉండే వారు మళ్ళీ పరాయి దేశములోకి వచ్చారని అంటారు. కేవలం వారొక్కరి కోసమే ఈ గాయనం ఉంది. అందరూ వారినే స్మృతి చేస్తారు, వారు విచిత్రులు. వారికి ఎటువంటి చిత్రమూ లేదు. బ్రహ్మా-విష్ణు-శంకరులను దేవతలని అంటారు. శివభగవానువాచ అని అంటారు, వారు పరంధామములో ఉంటారు. వారిని సుఖధామంలో ఎప్పుడూ పిలవరు. వారిని దుఃఖధామములోనే పిలుస్తారు. వారు వచ్చేదే సంగమయుగంలో. సత్యయుగములో పూర్తి విశ్వంలో పురుషోత్తములైన మీరు ఉంటారని పిల్లలైన మీకు తెలుసు. మధ్యములు, కనిష్ఠులు అక్కడ ఉండరు. ఉన్నతోన్నతమైన పురుషులు ఈ లక్ష్మీనారాయణులే కదా. వీరిని ఈ విధంగా తయారుచేసినవారిని శ్రీ శ్రీ శివబాబా అంటారు. శ్రీ శ్రీ అని ఆ శివబాబాను మాత్రమే అనడం జరుగుతుంది. ఈ రోజుల్లో సన్యాసులు మొదలైనవారు కూడా తమను తాము శ్రీ శ్రీ అని అంటారు. ఇప్పుడు తండ్రే స్వయంగా వచ్చి ఈ సృష్టిని పురుషోత్తమంగా తయారుచేస్తారు. మొత్తం సృష్టిలో ఉన్నతోన్నతమైన పురుషులు సత్యయుగంలో ఉంటారు. ఉన్నతాతి ఉన్నతమైనవారు మరియు కనిష్ఠుల కంటే కనిష్ఠుల యొక్క తేడాను ఈ సమయంలో మీరు అర్థము చేసుకున్నారు. కనిష్ఠ మానవులు తమ నీచత్వమును చూపిస్తారు. మేము ఎలా ఉండేవారిమి, ఇప్పుడు మళ్ళీ స్వర్గవాసులైన పురుషోత్తములుగా అవుతున్నామని మీరిప్పుడు అర్థం చేసుకుంటున్నారు. ఇది సంగమయుగము. ఈ పాత ప్రపంచము మళ్ళీ కొత్తదిగా అవ్వాలని మీకు లక్ష్యముంది. కొత్తది పాతదిగా, పాతది కొత్తదిగా తప్పకుండా అవుతుంది. కొత్తదానిని సత్యయుగమని, పాతదానిని కలియుగమని అంటారు. తండ్రి సత్యమైన బంగారము, సత్యము చెప్పేవారు. వారిని సత్యము అని అంటారు, అంతా సత్యమే చెప్తారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని ఏదైతే అంటారో, అది అసత్యము. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - అసత్యము వినకండి. చెడు వినకండి, చెడు చూడకండి... రాజ విద్య యొక్క విషయమే వేరు. ఆ విద్యలన్నీ అల్పకాలిక సుఖము కోసం. వేరే జన్మ తీసుకుంటే మళ్ళీ ప్రారంభము నుండి చదవాల్సిందే. అది అల్పకాలిక సుఖము. ఇది 21 జన్మలు, 21 తరాల కోసం. వృద్ధాప్యాన్ని తరం అని అంటారు. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువులు జరగవు. ఇక్కడ అకాల మృత్యువులు ఎలా జరుగుతున్నాయో చూడండి. జ్ఞానంలో కూడా మరణిస్తారు. ఇప్పుడు మీరు మృత్యువుపై విజయము పొందుతున్నారు. అది అమరలోకము, ఇది మృత్యులోకమని మీకు తెలుసు. అక్కడ వృద్ధులైనప్పుడు - మేము ఈ శరీరాన్ని వదిలి మళ్ళీ చిన్న పిల్లలుగా అవుతామని సాక్షాత్కారమవుతుంది. వృద్ధాప్యము పూర్తి అవుతూనే శరీరాన్ని వదిలేస్తారు. క్రొత్త శరీరము లభిస్తుందంటే అది మంచిదే కదా. కూర్చుని-కూర్చునే సంతోషంగా శరీరాన్ని వదిలేస్తారు. ఇక్కడ అటువంటి స్థితిలో (సంతోషంగా) ఉంటూ శరీరాన్ని వదలాలంటే చాలా కష్టము అనిపిస్తుంది. ఇక్కడ ఉండే శ్రమ, అక్కడ సామాన్యమైపోతుంది. ఇక్కడ దేహ సహితంగా ఏదైతే ఉందో అన్నింటినీ మర్చిపోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించి ఈ పాత ప్రపంచాన్ని వదిలేయాలి. కొత్త శరీరము తీసుకోవాలి. ఆత్మ సతోప్రధానంగా ఉన్నప్పుడు సుందరమైన శరీరము లభించింది. తర్వాత కామ చితిపై కూర్చోవడంతో నల్లగా తమోప్రధానంగా అయిపోయారు కావున శరీరము కూడా నల్లనిదే లభిస్తుంది. సుందరం నుండి శ్యామంగా తయారైపోయారు. కృష్ణుని పేరైతే కృష్ణుడే, మరి వారిని శ్యామ సుందరుడని ఎందుకంటారు? చిత్రాలలో కూడా కృష్ణుని చిత్రమును నల్లగా చూపిస్తారు, కాని అర్థము తెలియదు. సతోప్రధానంగా ఉన్నప్పుడు సుందరముగా ఉండేవారని ఇప్పుడు మీరు అర్థము చేసుకున్నారు. ఇప్పుడు తమోప్రధానంగా శ్యామంగా అయ్యారు. సతోప్రధానంగా ఉన్నవారిని పురుషోత్తములని అంటారు, తమోప్రధానంగా ఉన్నవారిని కనిష్ఠులని అంటారు. తండ్రి అయితే సదా పవిత్రమైనవారు. వారు సుందరంగా తయారుచేసేందుకు వస్తారు. బాటసారి కదా. కల్ప-కల్పము వస్తారు లేకపోతే పాత ప్రపంచాన్ని క్రొత్త ప్రపంచంగా తయారుచేసేదెవరు! ఇది పతిత ఛీ-ఛీ ప్రపంచము. ఈ విషయాలు గురించి ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు తండ్రి పురుషోత్తములుగా చేసేందుకు మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు. మళ్ళీ దేవతలుగా అయ్యేందుకు మనమే బ్రాహ్మణులుగా అయ్యాము. మీరు సంగమయుగీ బ్రాహ్మణులు. ఇప్పుడిది సంగమయుగమని ప్రపంచములోని వారికి తెలియదు. శాస్త్రాలలో కల్పము యొక్క ఆయుష్షు లక్షల సంవత్సరాలని వ్రాసేశారు, కనుక కలియుగము ఇంకా బాల్యావస్థలోనే ఉందని భావిస్తారు. మేము ఇప్పుడు ఉన్నతాతి ఉన్నతమైన, కలియుగ పతితుల నుండి సత్యయుగ పావనులుగా, మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చామని మీ మనస్సులో అర్థం చేసుకున్నారు. గ్రంథ్ లో కూడా, భగవంతుడు మలిన వస్త్రాలను శుభ్రము చేశారని మహిమ ఉంది. కాని ఆ గ్రంథ్ చదివేవారికి కూడా దాని అర్థము తెలియదు. ఈ సమయంలో తండ్రి వచ్చి పూర్తి ప్రపంచములోని మనుష్యులందరినీ శుభ్రం చేస్తున్నారు. మీరిప్పుడు ఆ తండ్రి ఎదురుగా కూర్చుని ఉన్నారు. తండ్రే పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఈ రచయిత-రచనల జ్ఞానము ఇంకెవ్వరికీ తెలియదు. తండ్రే జ్ఞాన సాగరులు. వారు సత్యము, చైతన్యము, అమరులు. పునర్జన్మ రహితులు. శాంతి సాగరులు, సుఖ సాగరులు, పవిత్రతా సాగరులు. మీరు వచ్చి ఈ వారసత్వాన్ని ఇవ్వండి అని అందరూ వారినే పిలుస్తారు. ఇప్పుడు తండ్రి మీకు 21 జన్మల కోసం వారసత్వమునిస్తున్నారు. ఇది అవినాశి చదువు. చదివించేవారు కూడా అవినాశి తండ్రి. అర్ధకల్పము మీరు రాజ్యాన్ని పొందుతారు, తర్వాత రావణ రాజ్యము వస్తుంది. అర్ధకల్పము రామ రాజ్యము, అర్ధకల్పము రావణ రాజ్యము.
ప్రాణాల కంటే ప్రియమైనవారు ఒక్క తండ్రియే, ఎందుకంటే వారే పిల్లలైన మిమ్మల్ని అన్ని దుఃఖముల నుండి విడిపించి అపారమైన సుఖములోకి తీసుకెళ్తారు. వారు మా ప్రాణాలకన్నా ప్రియమైన పారలౌకిక తండ్రి అని మీరు నిశ్చయముతో చెప్తారు. ప్రాణము అని ఆత్మను అనడం జరుగుతుంది. మానవ మాత్రులందరూ వారినే స్మృతి చేస్తారు, ఎందుకంటే అర్ధకల్పము కొరకు దుఃఖము నుండి విడిపించి సుఖ-శాంతులను ఇచ్చేవారు తండ్రి మాత్రమే. కనుక వారు ప్రాణాలకన్నా ప్రియమైనవారు కదా. సత్యయుగంలో మనమందరం సుఖంగా ఉండేవారిమని మీకు తెలుసు. మిగిలినవారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. తరువాత రావణరాజ్యములో దుఃఖము ప్రారంభమవుతుంది. ఇది సుఖ-దుఃఖాల ఆట. ఇక్కడే ఇప్పుడిప్పుడే సుఖము, ఇప్పుడిప్పుడే దుఃఖము ఉంటుందని మనుష్యులు భావిస్తారు. కాని కాదు, స్వర్గము వేరు, నరకము వేరు అని మీకు తెలుసు. తండ్రి అయిన రాముడు స్వర్గ స్థాపన చేస్తారు, రావణుడు నరకాన్ని స్థాపన చేస్తారు. అతడిని ప్రతి సంవత్సరము కాలుస్తారు. కాని ఎందుకు కాలుస్తారు? రావణుడు ఎటువంటి వస్తువు? ఏ మాత్రమూ తెలియదు. ఎంత ఖర్చు చేస్తారు! కూర్చుని ఎన్ని కథలను వినిపిస్తారు, రాముని సీతను, భగవతిని రావణుడు తీసుకువెళ్ళారు అని. మనుష్యులు కూడా అలా జరిగి ఉండవచ్చని భావిస్తారు.
ఇప్పుడు మీకు అందరి యొక్క కర్తవ్యము గురించి తెలుసు. మీ బుద్ధిలో ఈ జ్ఞానముంది. ప్రపంచమంతటి యొక్క చరిత్ర-భూగోళము గురించి ఏ మనుష్యమాత్రులకీ తెలిసి ఉండదు. తండ్రికి మాత్రమే తెలుసు. వారిని ప్రపంచ రచయిత అని కూడా అనరు. ప్రపంచము అయితే ఉండనే ఉంది, తండ్రి వచ్చి కేవలం ఈ చక్రము ఎలా తిరుగుతుందనే జ్ఞానాన్ని ఇస్తారు. భారతదేశములో ఈ లక్ష్మీనారాయణుల రాజ్యముండేది, తరువాత ఏమైంది? దేవతలు ఎవరితోనైనా యుద్ధము చేశారా? అటువంటిదేమీ లేదు. అర్ధకల్పము తర్వాత రావణ రాజ్యము ప్రారంభమవ్వడం వలన దేవతలు వామమార్గములోకి వెళ్ళిపోతారు. అంతేకానీ యుద్ధములో ఎవరో ఓడించారు అని అయితే కాదు. సైన్యము మొదలైనవాటి విషయమే లేదు. యుద్ధము ద్వారా రాజ్యము తీసుకోరు, పోగొట్టుకోరు. ఇక్కడ యోగము ద్వారా పవిత్రంగా అయ్యి పవిత్ర రాజ్యాన్ని మీరు స్థాపన చేస్తారు. అంతేకానీ మీ చేతిలో ఎటువంటి ఆయుధాలూ లేవు. ఇది డబల్ అహింస. ఒకటి పవిత్రత అనే అహింస, రెండవది మీరు ఎవ్వరికీ దుఃఖమునివ్వరు. అన్నింటికంటే పెద్ద హింస కామ ఖడ్గమునకు చెందినది. అదే ఆదిమధ్యాంతాలు దుఃఖమునిస్తుంది. రావణ రాజ్యములోనే దుఃఖము మొదలవుతుంది. వ్యాధులు మొదలవుతాయి. ఎన్ని రకాల వ్యాధులున్నాయి. అనేక రకాల మందులు కూడా వెలువడుతూ ఉంటాయి. అందరూ రోగులైపోయారు కదా! మీరు ఈ యోగబలము ద్వారా 21జన్మల కొరకు నిరోగులుగా అవుతారు. అక్కడ దుఃఖము, అనారోగ్యం యొక్క నామ రూపాలే ఉండవు. అందుకోసమే మీరు ఇక్కడ చదువుకుంటున్నారు. భగవంతుడు మమ్మల్ని చదివించి భగవాన్-భగవతీలుగా చేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. చదువు కూడా ఎంత సహజమైనది! అర్ధగంట లేక ముప్పావు గంటలో మొత్తం చక్రమంతటి జ్ఞానమును అర్థం చేయిస్తారు. 84 జన్మలు కూడా ఎవరెవరు తీసుకుంటారో మీకు తెలుసు.
భగవంతుడు మనల్ని చదివిస్తున్నారు, వారు ఉన్నదే నిరాకారులు. వారి సత్యాతి-సత్యమైన పేరు శివ. కళ్యాణకారి కదా. సర్వుల కళ్యాణకారి, సర్వుల సద్గతిదాత, ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి. ఉన్నతాతి ఉన్నతమైన మనుష్యులను తయారుచేస్తారు. బాబా చదివించి వివేకవంతులుగా చేసి, ఇప్పుడు మీరు వెళ్ళి ఇతరులకు చదివించండి అని చెప్తారు. ఈ బ్రహ్మాకుమార్-కుమారీలను చదివించేవారు శివబాబా. బ్రహ్మా ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకున్నారు. ప్రజాపిత బ్రహ్మా ఎక్కడ నుండి వచ్చారు? ఈ విషయములోనే అందరూ తికమక చెందుతున్నారు. వీరి అనేక జన్మల అంతిమంలో నేను దత్తత తీసుకున్నానని బాబా చెప్తున్నారు. ఇప్పుడు అనేక జన్మలు ఎవరు తీసుకున్నారు? ఈ లక్ష్మీనారాయణులే పూర్తిగా 84 జన్మలు తీసుకున్నారు, కనుకనే కృష్ణుడిని శ్యామసుందరుడని అంటారు. మనమే సుందరంగా ఉండేవారము, తర్వాత 2 కళలు తగ్గిపోయాయి. కళలు తగ్గుతూ-తగ్గుతూ ఇప్పుడు కళాహీనంగా అయ్యాము. ఇప్పుడు తమోప్రధానం నుండి సతోప్రధానంగా ఎలా అవ్వాలి? నన్ను స్మృతి చేస్తే మీరు పావనంగా అవుతారు అని తండ్రి చెప్తున్నారు. ఇది రుద్రజ్ఞాన యజ్ఞమని కూడా మీకు తెలుసు. ఇప్పుడు యజ్ఞానికి బ్రాహ్మణులు కావాలి. సత్యమైన గీతను వినిపించేది సత్యమైన బ్రాహ్మణులైన మీరే, అందుకే మీరు సత్యమైన గీతాపాఠశాల అని వ్రాస్తారు. ఆ గీతలో పేరే మార్చేశారు. కల్పక్రితము ఎవరు ఎలా వారసత్వము తీసుకొని ఉంటారో ఇప్పుడూ అలాగే తీసుకుంటారు. మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి - మేము పూర్తి వారసత్వాన్ని తీసుకోగలమా? మనుష్యులు శరీరమును విడిచిపెట్టినప్పుడు ఖాళీ చేతులతో వెళ్తారు, ఆ వినాశి సంపాదన తోడుగా అయితే వెళ్ళదు. మీరు శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు చేతులు పూర్తిగా నింపుకొని వెళ్తారు, ఎందుకంటే 21 జన్మలకు మీరు జమ చేసుకుంటున్నారు. మనుష్యుల సంపాదనంతా మట్టిలో కలిసిపోతుంది. దీనికంటే మనదంతా ట్రాన్స్ఫర్ చేసి బాబాకు ఎందుకు ఇవ్వకూడదు? ఎవరైతే ఎక్కువగా దానము చేస్తారో వారు మరుసటి జన్మలో ధనవంతులుగా అవుతారు, ట్రాన్స్ఫర్ చేస్తారు కదా. ఇప్పుడు మీరు 21 జన్మల కొరకు క్రొత్త ప్రపంచములోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మీకు తిరిగి 21 జన్మల కొరకు ప్రతిఫలము లభిస్తుంది. వారు ఒక్క జన్మ కొరకు అల్పకాలికంగా ట్రాన్స్ఫర్ చేస్తారు. మీరు 21 జన్మల కొరకు ట్రాన్స్ఫర్ చేస్తారు. తండ్రి అయితే దాత. ఇది డ్రామాలో నిర్ణయించబడింది. ఎవరు ఎంత చేసుకుంటారో అంత పొందుతారు. వారు పరోక్షంగా దానపుణ్యాలు చేస్తే అల్పకాలానికి ప్రతిఫలము లభిస్తుంది. ఇది ప్రత్యక్షము. ఇప్పుడు మీదంతా నూతన ప్రపంచానికి ట్రాన్స్ఫర్ చేయాలి. వీరిని (బ్రహ్మాను) చూశారు కదా, ఎంత సాహసము చేశారు! సర్వస్వమూ ఈశ్వరుడే ఇచ్చారని మీరంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఇదంతా నాకు ఇచ్చేయండి. నేను మీకు విశ్వ చక్రవర్తిత్వాన్ని ఇస్తాను. బాబా అయితే వెంటనే ఇచ్చేసారు, ఏమీ ఆలోచించలేదు. ఫులపవర్ ను ఇచ్చేసారు. నాకు విశ్వ చక్రవర్తిత్వం లభిస్తుందనే నషా ఎక్కింది. పిల్లలు మొదలైనవారి గురించి కూడా సంకల్పము నడవలేదు. ఇచ్చేవారు ఈశ్వరుడైనప్పుడు ఎవరి బాధ్యతనైనా ఎందుకు తీసుకోవాలి? 21 జన్మలకు ఎలా ట్రాన్స్ఫర్ చేయాలో తెలుసుకోవాలంటే - ఈ తండ్రిని(బ్రహ్మాను) చూడండి, ఫాలో ఫాదర్ చేయండి. ప్రజాపిత బ్రహ్మా చేసారు కదా. ఈశ్వరుడు దాత. వారు వీరి ద్వారా చేయించారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చామని మీ అందరికీ తెలుసు. రోజురోజుకూ సమయం తగ్గిపోతూ ఉంటుంది. ఆపదలు ఎలా వస్తాయో అడగకండి. వ్యాపారుల శ్వాస గుప్పిటిలో ఉంటుంది, ఏ యమదూతలు వస్తారో అని. సైనికుడి ముఖము చూసి మనుష్యులు స్పృహ కోల్పోతారు. ఇంకా ముందు-ముందు చాలా విసిగిస్తారు. బంగారం మొదలైనవి ఏవీ పెట్టుకోనివ్వరు. మిగిలింది మీ వద్ద ఏముంటుంది? డబ్బులే ఉండవంటే ఏం కొనగలరు? నోట్లు కూడా చెల్లవు. రాజ్యమే మారిపోతుంది. అంతిమంలో చాలా దుఃఖముతో మరణిస్తారు. చాలా దుఃఖము తర్వాత సుఖముంటుంది. ఇది అనవసరంగా చంపుకొనే ఆట. ప్రకృతి వైపరిత్యాలు కూడా వస్తాయి. అంతకు ముందే తండ్రి నుండి సంపూర్ణ వారసత్వమును తీసుకోవాలి. భలే తిరగండి, కాని తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పావనంగా అవుతారు. కాని ఆపదలు చాలా వస్తాయి. అయ్యో-అయ్యో అని చాలా అంటూ ఉంటారు. అంతిమంలో ఒక్క శివబాబా స్మృతే ఉండే విధంగా పిల్లలైన మీరు అభ్యాసము చేయాలి. వారి స్మృతిలోనే శరీరాన్ని వదిలేయాలి, ఇతర బంధుమిత్రలు మొదలైనవారెవ్వరూ గుర్తు రాకూడదు. ఈ అభ్యాసమును చేయండి. తండ్రి ఒక్కరినే స్మృతి చేసి నారాయణునిగా అవ్వాలి. ఈ అభ్యాసమును చాలా చేయాలి. లేకపోతే చాలా పశ్చాత్తాపపడాల్సి వస్తుంది. ఇతరులెవ్వరైనా స్మృతి వచ్చినట్లయితే పాస్ అవ్వలేరు. పాస్ అయిన వారు మాత్రమే విజయమాలలో కూర్చబడతారు. మేము తండ్రిని ఎంత సమయం స్మృతి చేస్తున్నాము అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. మీ చేతిలో ఏదైనా ఉన్నట్లయితే అది అంత్యకాలములో గుర్తుకొస్తుంది. చేతిలో లేదంటే గుర్తు కూడా రాదు. తండ్రి చెప్తున్నారు - నా దగ్గర ఏమీ లేదు. ఇవి నా వస్తువులు కావు. ఆ జ్ఞానానికి బదులుగా ఈ జ్ఞానమును తీసుకుంటే 21 జన్మలకు వారసత్వము లభిస్తుంది. లేకుంటే స్వర్గ వారసత్వాన్ని పోగొట్టుకుంటారు. మీరు ఇక్కడకు తండ్రి యొక్క వారసత్వమును తీసుకునేందుకే వస్తారు. తప్పకుండా పావనమవ్వాలి. లేకపోతే శిక్షలు అనుభవించి లెక్కాచారము సమాప్తం చేసుకొని వెళ్తారు. పదవి కూడా ఏదీ లభించదు. శ్రీమతానుసారము నడుచుకుంటే, కృష్ణుడిని మీ ఒడిలోకి తీసుకుంటారు. కృష్ణుని వంటి పతి, కృష్ణుని వంటి పుత్రుడు కావాలని అంటారు కదా. కొంతమంది చాలా బాగా అర్థము చేసుకుంటారు, కొందరు తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. అచ్ఛా.
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. బ్రహ్మాబాబా ఎలాగైతే తమ సర్వస్వాన్ని బదిలీ చేసి పూర్తి అధికారాన్ని తండ్రికి ఇచ్చేసారో, ఏమీ ఆలోచించలేదో, అలా తండ్రిని అనుసరించి 21 జన్మలకు ప్రాలబ్ధాన్ని జమ చేసుకోవాలి.
2. అంత్య కాలములో ఒక్క తండ్రి తప్ప ఏ వస్తువూ గుర్తు రాకుండా ఉండేలా అభ్యాసము చేయాలి. మనదేమీ లేదు. సర్వస్వమూ బాబాదే. బాబా మరియు వారసత్వం, ఈ స్మృతి ద్వారా ఉత్తీర్ణులై విజయమాలలో రావాలి.